Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cm revanthreddy : సీఎం రేవంత్ కీలక నిర్ణయం, డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

సీఎం రేవంత్ కీలక నిర్ణయం, డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

ప్రజా దీవెన, హైదరాబాద్: సమాజంలో కొత్త పుంతలు తొక్కు తున్న నేరాలను అరికట్టడంలో సరి కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లా లని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసు శాఖకు సూచించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ మహమ్మారిని నిరో ధించడానికి పోలీసు శాఖ లో సుశిక్షితులైన వారితో ప్రత్యేక విభాగా లను ఏర్పాటు చేయాలని దిశా నిర్ధేశం చేశారు. డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని, పోలీస్ రైజింగ్ డేను స్మరిస్తూ, ప్రజా సేవ కోసం ఎక్కువ సమయం విధి నిర్వహణలో ఉంటున్న హోంగార్డు లకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పలు వరాలను ప్రకటించారు.

ప్రజా పాలన – ప్రజా విజ యోత్సవాలు కార్యక్రమాల్లో భాగం గా హోం శాఖ విజయాలపై నెక్లెస్ రోడ్డు హెచ్ఎండీఏ మైదానంలో నిర్వహించి న సదస్సులో ముఖ్య మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగా లు, డాగ్ స్వ్కాడ్‌లు ఇచ్చిన ప్రద ర్శనలను తిలకించారు. ఆయా విభాగాలు వినియోగించే ఆయు ధాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరికరా లతో ఏర్పాటు చేసిన ప్రద ర్శనను తిలకించారు. ట్రాఫిక్ అసి స్టెంట్స్‌ గా నియమితులైన ట్రాన్స్‌జెం డర్ అభ్యర్థులకు నియామక పత్రా లను అందించారు.

అనంతరం ముఖ్యమంత్రి సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గంజా యి, ఇతర మాద క ద్రవ్యాలను నిరోధించడంలో కొంత ప్రగతి సాధిం చినప్పటికీ ప్రస్తుత చర్యలు సరిపోవు. మరింత కఠినంగా వ్యవహ రించాల్సి ఉంది. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ వంటి కేసుల్లో న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడే విధంగా స్పెషల్ ఫోర్స్‌ ను ఏర్పాటు చేసి సుశిక్షితు లైన అధికారులను నియమించాలి. ఈ కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. హైదరాబాద్ నగరం లో ప్రధానంగా కాలుష్యం తగ్గించడం, ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన అవసరం ఎంతో ఉంది.

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాన్స్ జెండర్లు అడుక్కునే దృశ్యాలను గమనిం చి, వారు ఆత్మగౌరవంతో బతకడానికి, జనజీవన స్రవంతిలో చేర్చాల న్న ఉద్దేశంతో ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా విధుల్లోకి తీసుకోవడం జరిగింది. సమాజంలో వారు వివక్షకు గురికావొద్దు.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పోలీసు ఉన్నతోద్యోగులకు పరిహారం చెల్లిస్తున్నట్టుగానే, హాం గార్డులు ఎవరైనా ప్రమాదవ శాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించాం.

అలాగే, హోంగార్డులకు రోజుకు 921 రూపా యలు చెల్లిస్తుండగా, ఇకనుంచి 1000 రూపాయలకు పెంపు. వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.1 00 నుంచి రూ.200 కు పెంపు. ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సౌక ర్యాలు అందుతున్న ట్టుగా హోం గార్డులకు ఆ సౌకర్యాలు లేని కార ణంగా వారి కుటుంబా లను రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం. ఇవ న్నీ జనవరి ఒకటి నుంచి అమలు చేస్తాం.పోలీసు పిల్లలు సైతం ఉ న్నతమైన విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో నేషనల్ డిఫెన్స్ అకా డమీ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లకు తీసిపోకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 50 ఎకరాల్లో పోలీస్ స్కూల్ ప్రారంభిస్తు న్నామన్నారు.

ఎక్కడి నుంచి వచ్చారంటే పోలీస్ స్కూల్ నుంచి వచ్చామని సగ ర్వంగా చెప్పుకునే స్థాయిలో తీర్చిదిద్దుతామని సమాజానికి ఎన్నో సేవలు అందిస్తున్న పోలీసు ఉద్యో గం అంటే మీకు ఉపాధి కాదు. ఇదొక భావోద్వేగం. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే బాధ్యత మీపైన ఉం ది. ప్రెండ్లీ పోలీసు అంటే బాధితుల పట్ల మర్యా దగా వ్యవహరిం చాలి. బాధితులు, అన్యాయానికి గురైన వారి పట్ల గౌరవంగా వ్యవ హరించాలన్నారు. కబ్జాలు, హత్యలు, ఆర్థిక నేరగా ళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. నేరగాళ్లకు ప్రొటోకాల్ పాటిస్తే మీరు మీ విధులను నిర్వర్తించలేరని చెప్పారు.

సమాజంలో ఎక్కువ సేవలు అందిస్తున్నది పోలీసులే. అలాగే ఎక్కు వ విమర్శలు ఎదుర్కోనేది కూడా పోలీసులే. యూనిఫామ్ ఫోర్స్ అంటే క్రమశి క్షణతో ఉండాలి. మీకేవైనా సమస్యలు ఉంటే వినడాని కి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించే మీకు సమస్యలు ఉండొద్దు… అని ముఖ్యమంత్రి గారు వివరించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతిని ధులతో పాటు హోం శాఖ కా ర్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఆయా విభాగాల అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Cm revanthreddy