–ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవ సాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సీఎం చేతుల మీదుగా 1034 రైతు వేదికల్లో కార్యక్రమం
–రేపటి కార్యక్రమ ఏర్పాట్లపై అధికా రులతో మంత్రి తుమ్మల
ప్రజా దీవెన హైదరాబాద్:
Rythunestham: నేడు సా యంత్రం 4 గంటలకు ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1034 రైతు వేదికల్లో రైతునేస్తం కార్య క్రమం ప్రారంభోత్సవం జరగనున్న దృష్ట్యా ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆడిటోరియం వద్ద ఏర్పా ట్లను సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యవ సాయశాఖ డైరెక్టర్ గోపి, రేపు రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతువేదికలలో, ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ ఆడిటోరియంలో దాదాపు 15 00 మంది రైతులు పాల్గొంటారని తెలియజేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇప్పటికే 566 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సదుపా యం కల్పించి ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా ముఖాముఖి ఆదర్శ రైతుల అనుభవాలు, వ్యవ సాయరంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను రైతులకు తెలియజేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు 6.35 లక్షల మంది రైతుల ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాకుండా, వివిధ రైతుల అనుభవాలను తెలుసుకొన్నారని చెప్పారు.
ప్రస్తుతం ఈ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని మరొక 1034 రైతు వేదికలకు కల్పించిన సందర్భంగా, వీటిని ప్రారంభోత్సవం చేయవల్సిందిగా సీఎం, డిప్యూటీ సీఎo లను కలిసి వ్యవసాయశాఖ ఆహ్వనించడం జరిగింది. తొలకరి ఆరంభమై వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా వున్న రైతు వేదికల్లో హాజరైన రైతులతో ముఖ్యమంత్రి నేడు ముఖాముఖి ముచ్చటించనున్నారన్నారు.
ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం వ్య వసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోనే దాదాపు 78000 కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు చేసిన విషయాన్ని గుర్తుచే స్తు, రేవంత్ రెడ్డి పాలనలో మన రైతాంగం సుభిక్షంగా ఉండేటందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయని పథకాలను ఇప్పటికే అమలు చేసి వివిధ రాష్ట్రాలకు ఒక దశ, దిశ చూపించిందని, రుణమాఫీ, సన్న ధాన్యానికి బోనస్, అన్ని రకాల పంటలను మద్ధతు ధరకు కొనుగోలు, అన్ని పంటలకు సబ్సిడీపై సూక్ష్మ సేద్య పరికరాల సరఫరా వంటివి మచ్చుతునక అని తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని నేడు సాయంత్రం వారి వారి జిల్లాల్లో ఉన్న రైతు వేదికల నుంచి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రైతులు, పాల్గొని విజయవంతము చేయాలని మంత్రి విజ్ఙప్తి చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఏర్పాట్లపై ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రేపు ఇక్కడ పాల్గొనే రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా అధికారులను ఆదేశించారు.