Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMRevanthReddy : దేశాన్ని సూపర్ పవర్ గా నిలపాలన్న మోదీ సంకల్పoకు సీఎం రేవంత్ మద్దతు

దేశాన్ని సూపర్ పవర్ గా నిలపా లన్న మోదీ సంకల్పoకు సీఎం రే వంత్ మద్దతు

CMRevanthReddy:  ప్రజా దీవెన, న్యూఢిల్లీ: జమ్ము కా శ్మీర్ పహల్గాంలో మారణకాండ సృ ష్టించిన ఉగ్రవాదానికి వ్యతిరేకం గా భారత సైన్యం ఆ పరేషన్ సిం దూర్ నిర్వహించినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి, భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. 1971 లో ఇందిరా గాంధీ నాయకత్వం లో పాకిస్థాన్ ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన చరిత్ర ను గుర్తు చేశారు. నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

2047 నాటికి మన భారత దేశాన్ని సూపర్ పవర్ గా, నెంబర్ వన్ గా నిలబెట్టాలన్న మోదీ సంకల్పాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ‘విక సిత భారత్’ ప్రణాళికను రూపొం దించడం అభినందనీయమ న్నారు.అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అ భివృద్ధికి ప్రణాళిక సిద్ధ మైందని, ఆ ర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యా లతో తెలంగాణ రైజింగ్​ – 2047 విజన్ డాక్యుమెంట్ రూ పొందించామని సీఎం ప్రకటించారు.

‘తెలంగాణ రైజింగ్ విజన్ లోని నాలుగు కీలక అంశాలను ముఖ్య మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావిం చారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధా న్యమిస్తామన్నారు. తెలంగాణ సా మాజిక, ఆర్థిక, వి ద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన, బీసీలకు 42% రిజర్వేష న్‌లు, ఎస్సీల ఉప వర్గీకరణకు ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. తెలంగాణ సమ గ్రాభివృ ద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాల సీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియ ల్ పాలసీ, టూరిజం పాలసీలను సి ద్ధం చేసి కార్యాచరణలో పెట్టినట్లు చెప్పారు.

అభివృద్దిలో, సంక్షేమంలో ఆయా వర్గాలకు న్యాయమైన వాటా ఇ వ్వాలన్నది తమ సంకల్పమ న్నా రు. అందుకే తెలంగాణలో సామా జిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగ, రాజకీ య కుల గణన చేపట్టాం. బీసీల కు విద్య, స్థానిక సంస్థల్లో 42 శా తం రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకు లాల వర్గీకరణ ఈ రెండు చరిత్రాత్మక నిర్ణయాలను దేశంలోనే మొ ట్టమొదటగా తెలంగాణ అమలు చేయడం గర్వంగా ఉందన్నారు.

దేశవ్యాప్త కుల గణనకు కేంద్రం తీ సుకున్న నిర్ణయాన్ని ముఖ్య మంత్రి స్వాగతించారు. కులగణనలో తె లంగాణ అనుభవాలను పంచుకు నేందుకు సిద్ధంగా ఉందన్నారు.2028 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యాన్ని ప్రక టించారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర ఉండేలా విధానాలు రూపొందించినట్లు సీఎం ప్రకటించారు.

మహా లక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, రూ.5 00కే గ్యాస్ సిలిండర్, ఇంది రమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సం ఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు, మహిళా సంఘాలకు పాఠశాలల నిర్వహణ, శిల్పారామంలో 100 స్టాళ్లతో మహిళా బజార్ అంశా లను ప్రధానంగా ప్రస్తావించారు. సోలార్ పవర్ జనరేషన్ లోనూ భాగస్వా మ్యం కల్పించి మహిళలను వ్యాపార, పారిశ్రామికవే త్తలుగా ప్రోత్స హించే కార్యక్రమాలు అమలు చేశామన్నారు.

మన దేశ భవిష్యత్తు మన యువత. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువతదే కీలక పాత్ర. అందుకే యువత ఆశయాల సాధనకు అనుగుణంగా యూత్ పాలసీ అమలు చేస్తున్నాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం, ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకవైపు మా నవ వనరులకు డిమాండ్ పె రుగుతున్నా మరోవైపు నిరుద్యోగ సమస్య నెలకొంది. నైపుణ్యాల కొరతే ఈ అంతరానికి కారణమని గుర్తించాం. అందుకే యంగ్ ఇండి యా స్కిల్ యూనివర్సిటీ, స్పో ర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, ఐటీ ఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెం టర్లుగా ఆధునీకరించి స్కిల్ శిక్షణ ఇస్తున్నామని సీఎం వివరించారు.

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి ప్ర కటించారు. మాదక ద్రవ్యాల ని ర్మూలన, వాటికి అడ్డుకట్ట వేయ టంలో139 దేశాల్లో తెలంగాణ నెంబర్-1 స్థానం సాధించిన విష యాన్ని గుర్తు చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యు వతకు రూ.5 లక్షల స్వయం ఉపాధి పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభిస్తామన్నారు.దేశానికి రైతే వెన్నెముక అని, ఆ వెన్నెముక కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం. వారిని అప్పుల ఊబి నుండి బయటకు తేవడం, తిరిగి ఆ ఊబిలోకి జారిపోకుండా నిలబె ట్టాలన్న లక్ష్యాలతో పని చేస్తున్నా మన్నారు.

తెలంగాణలో 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,6 16 కోట్ల రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తులను చేశాం. సాగు కోసం రైతు మళ్లీ అప్పుల పాలు కాకూడదన్న ఉద్దేశంతో ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం చేస్తున్నాం. బియ్యానికి మద్ధతు ధరకు అదనంగా క్వింటాల్ కు రూ.500 చెల్లించి వ్యవసాయాన్ని లా భసా టిగా మారుస్తున్నాం. రైతు కు చేదోడుగా ఉండే వ్యవసాయ కూలీకి రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తున్నాం.ఈ రోజు వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించి దేశానికి ఆద ర్శంగా నిలిచాం.

ఈ నేపథ్యంలో రైతుల కోసం చేసే వ్యయాన్ని సంక్షేమ కోణంలో కాక… ఆహార సంపద సృష్టికి పెడుతున్న పెట్టుబ డిగా చూడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 2047 నాటికి ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా విషయంలో అంతర్జాతీయ నగరాల సరసన తెలంగాణను నిలబెట్టే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణ రైజింగ్​ – 20 47 విజన్​​ ఎంచు కున్నట్లు చెప్పా రు. ఈ లక్ష్య సాధనలో తొలి అడుగుగా.. ఏడాది న్నర కాలంలో అమె రికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరి యా, దావోస్ (స్విట్జర్ లాండ్) దేశాలలో పర్యటించి రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొ త్తాన్ని మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తు న్నా మ ని, తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగా ణగా విభజించి వృద్ధి సాధిస్తామన్నారు.

తెలంగాణలో కోర్ అర్బ‌న్‌, సెమీ అర్బ‌న్‌, రూర‌ల్ విభాగాల్లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ సె కండ్ ఫేజ్, ఫ్యూచర్ సిటీ నిర్మా ణం, మాన్యూఫాక్చరింగ్ హబ్, అగ్రిబేస్డ్ ప‌రిశ్ర‌ములు ఏర్పాటు చేస్తా మ‌న్నారు. సబర్మతీ రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ ప్రాజెక్ట్ మాది రిగా తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయా లనే ఆలోచన ఉందని, మెట్రో సెకండ్ ఫేజ్, రీజనల్ రింగ్ రోడ్డు ప్రా జెక్టులు ప్రస్తుతం డీపీఆర్ ల స్టేజ్ లో ఉన్నాయి. రేడియల్ రోడ్ల ని ర్మాణం. తెలంగాణ ప్రతిపాదిత డ్రై పోర్ట్ నుండి మచిలీపట్నం పో ర్టుకు ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం తెలంగాణ అభి వృద్ధిలో కీలకమవు తాయన్నారు.

గుడ్ గవర్నెన్స్ తో అత్యున్నత ప్ర మాణాలతో పౌర సేవలను అంది స్తామని , ఇందులో భాగంగా BU ILD NOW యాప్ ద్వారా నిర్మాణ రంగానికి వేగం పెంచినట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్‌ ను డేటా సెంటర్ హబ్‌గా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్న‌ట్లు చెప్పా రు. విద్య, వై ద్యం లో అంతర్జాతీయ ప్రమాణా లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ’వికసిత భారత్‌ లక్ష్య సాధన మనందరి ఆశయం.

అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని మా ఆ కాంక్ష. “నేష న్ ఫస్ట్ – పీపుల్ ఫస్ట్” అన్న ప్రాధాన్యతతో ముం దుకు వెళుతు న్నాం. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య. కేంద్రం సహాయ సహ కారం మద్దతు లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలు చేయలేం. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సహక రించండి, వికసిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.