సీఎం రేవంత్ కు సరస్వతీ పుష్కరాల ఆహ్వానం
CMRevanthReddy: ప్రజా దీవెన, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాల ఆహ్వానం అందింది. పుష్కరాల్లో పాల్గొనా ల్సిం దిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మం త్రి కొండా సురేఖ ఆహ్వానం అందిం చారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కలిసి జూబ్లీ హిల్స్ నివాసంలో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రికి ఆహ్వానం అందజేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ మ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కి మంత్రి ఆహ్వానం అందించారు. ఈనెల 15 నుంచి 26 వ తేదీ వరకు 12 రోజుల పా టు జరిగే భూపాలపల్లి జిల్లా కాళే శ్వరం సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్త కుండా చేస్తున్న ఏర్పాట్ల గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడి గి తెలుసుకున్నారు.