సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, వచ్చే యాభైఏళ్లకు సరిపడా రోడ్ల అను సంధానం
CMRevanthReddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ లో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా రీజినల్ రింగ్ రోడ్డు, రేడి యల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణం, జంక్షన్లు, వాటి మధ్య అ నుసంధానత ఉండాలని రాష్ట్ర ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధి కారులకు సూచించారు. ఆర్ఆర్ఆర్ (దక్షిణ భాగం) కు సంబంధిం చిన అలైన్మెంట్ను పరిశీలించిన ము ఖ్యమంత్రి పలు మార్పులు సూచిం చారు. రీజనల్ రింగ్ రోడ్డు (RRR), రేడియల్ రోడ్ల నిర్మాణం తో పాటు ఇతర అంశాలపై రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులతో జూబ్లీహిల్స్ నివా సంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఆర్ఆర్ఆర్ (సౌత్)కు సంబంధిం చిన అలైన్మెంట్కు సంబంధించి అటవీ ప్రాంతం, జల వనరులు, మండల కేంద్రాలు, గ్రామాల విష యంలో ముందుగానే లైడర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. అలై న్మెంట్ విషయంలో తగు జాగ్రత్త లు తీసుకోవాలని, ఎటువంటి పొ రపాట్లకు తావివ్వరాదని స్పష్టం చేశారు.
శాటిలైట్ టౌన్షిప్లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణం గా రేడియల్ రోడ్లకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి చెప్పా రు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అనుసంధానం చేసే రేడి యల్ రోడ్ల నిర్మాణం ప్రక్రియ వేగ వంతం చేయాలన్నారు.
హైదరాబాద్ నుంచి వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు ఆర్ఆర్ఆర్ వెలుపలికి వెళ్లే ప్రాంతంలో తగు రీ తిలో ట్రంపెట్స్ నిర్మించాలని, ఎటు వంటి గందరగోళానికి తావు లేకుం డా, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా దాటే లా చూడాలని సీఎం అధికారులకు తెలిపారు.
హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ ర హదారిలో ఎలివేటెడ్ కారిడార్, నూతన అలైన్మెంట్కు సంబంధిం చి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రాజీవ్ రహదారికి ప్ర త్యా మ్నాయంగా ఓఆర్ఆర్ నుంచి మం చిర్యాల వరకు నూతన రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రత్యా మ్నాయ అలైన్మెంట్ను సాధ్య మైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆ మార్గంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను పరిశీలించాలన్నారు. ఈ నూతన రహదారులకు సంబంధించి జాతీ య రహదారుల శాఖ అధికారు ల తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూ చించారు.