Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMrevanthreddy : ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ సింగపూర్ పర్యటన

ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ సింగపూర్ పర్యటన

CMrevanthreddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారధ్యం లోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతం గా ముగిసింది. చివరి రోజున ముఖ్యమం త్రి నేతృత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు, అధికారులతో కూడిన బృందం సింగపూర్ ప్రధాన వ్యాపార సం స్థల అధినేతలు, సింగ పూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) ప్రతినిధు లతో ముఖాముఖి సంభాషణ లు, చర్చలు జరిపింది.

ఇండి యన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈ వో ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్‌ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్‌ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్‌ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్ తదితరులతో చర్చ లు జరిపిన ముఖ్య మం త్రి తెలంగాణలో పెట్టుబడులు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానా లను వారికి వివరించారు. సింగపూర్ లో మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది.

పర్యటనలో ఆశించిన పెట్టుబడుల ఒప్పందాల తో పాటు సింగపూర్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఐటీఈ) తో తెలంగాణ యం గ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చు కోవ టం కీలక పరి ణామం. హైదరాబాద్ లోని ఫ్యూ చర్ సిటీలో అత్యా ధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రూ. 3,500 కోట్ల పెట్టుబ డులకు ఒప్పందం కుదుర్చుకుంది.

హైదరాబాద్ లో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్యాండ్ కంపె నీ నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.450 కోట్లతో ఈ పార్కును అ భివృద్ధి చేయనుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్ర మలు, పెట్టుబడుల అవకాశాలపై సింగ పూర్‌ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసో సియేషన్ తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి.

సింగపూర్ నుం చి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు దావోస్​ కు బయ ల్దేరనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సద స్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అను కూల తలను చాటి చెప్పి హైదరా బాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్య స్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృం దం దావోస్ పర్యటనకు బయల్దేరుతోంది.