Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMrevathreddy :; సీఎం కీలక నిర్ణయం, 14న భూ భార‌తి ప్రారంభోత్స‌వం

- పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మం డ‌లాలు --ప్ర‌తి మండ‌లంలో అవ‌గాహ‌న స‌ద‌స్సులు --ప్ర‌జ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో ప్రతిష్ఠాత్మక పోర్ట‌ల్ -- తెలంగాణ ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి

 

CMrevathreddy: ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, లావాదేవీల‌ కు సంబంధించిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా, వేగంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్ట‌ల్ ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. భూ భార‌తిని సో మ‌వారం ప్రారంభించ‌నున్న నేప‌ థ్యంలో త‌న నివాసం లో సీఎం రేవంత్ రెడ్డి శనివారం స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికా రులకు సూచించారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలం గాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసు కొని వాటిలో క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ప్రజలకు, రైతులకు భూ భార‌తిపై అవ‌గాహ‌న కల్పించాల‌ని సీఎం సూచించారు. ఆయా స‌ద‌స్సుల్లో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే సందేహాల‌ను నివృత్తి చేయాలన్నారు.

అనంత‌రం రాష్ట్రంలోని ప్ర‌తి మం డ‌లంలోనూ క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌జలు, రైతుల‌కు అర్ధ‌మ‌య్యేలా, సుల‌భ‌మైన భాష‌ లో పోర్ట‌ల్ ఉండాల‌ని ముఖ్య‌ మంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశిం చారు.

పోర్ట‌ల్ బ‌లోపేతానికి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌ రిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయాలని ముఖ్య‌మంత్రి అధికారు ల‌కు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను ప‌టిష్టంగా నిర్వ‌ హించాల‌ని సీఎం ఆదేశించారు.

ఈ స‌మీక్ష‌లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శు లు వి.శేషాద్రి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్ర‌ట‌రీ సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి జ్యోతి బుద్ద‌ప్ర‌కాష్‌, సీసీఎల్ఏ కార్య‌ద‌ర్శి మ‌క‌రంద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అత్యంత నిరుపేద‌ అర్హుల‌కే ఇళ్లు కేటాయించాలి....అత్యంత ని రుపేద‌లు, అర్హుల‌కే ఇందిర‌ మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రే వంత్ రెడ్డి అన్నారు. ఇందిర‌ మ్మ ఇళ్ల‌పై త‌న నివాసంలో ముఖ్య‌ మంత్రి ఏ.రేవంత్ రెడ్డి శ‌నివారం స‌ మీక్ష నిర్వ‌హించారు. గ్రామ స్థా యి లో ల‌బ్ధిదారుల ఎంపిక‌లో ఇందిర‌ మ్మ క‌మిటీలు జాగ్ర‌త్త వ‌హిం చాల‌ని అర్హుల‌నే ఎంపిక చేయాల‌ని సీఎం అన్నారు.

ఇందిర‌మ్మ క‌మిటీ త‌యారు చేసిన జాబితాను మండ‌ల అధికారు ల‌తో కూడిన (త‌హ‌శీ ల్దార్‌, ఎంపీడీవో, ఇంజినీర్‌) బృం దం క్షేత్ర స్థాయికి వెళ్లి త‌నిఖీ చే యాల‌ని సీఎం రేవం త్ రెడ్డి ఆదేశించారు. ఎవ‌రైనా అన‌ ర్హుల‌కు ఇల్లు ద‌క్కిన‌ట్ల‌యితే త‌క్ష‌ణ‌ మే దానిని ఇందిర‌ మ్మ క‌మిటీకి తెలి య‌జేసి ఆ స్థానంలో మ‌రో అర్హుని కి ఇల్లు మం జూరు చేయాల‌న్నారు.

ఇందిర‌మ్మ ఇళ్ల పేరుతో ఎవ‌రైనా దందాలు చేస్తున్న‌ట్లు తెలిస్తే వెంట‌ నే కేసులు న‌మోదు చేయాల‌న్నా రు. అన‌ర్హులు ఎవ‌రైనా ఇల్లు ద‌ క్కించుకొని నిర్మించుకుంటే చ‌ట్ట‌ ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌డం పాటు వారు పొందిన మొత్తాన్ని వ‌సూలు చే యాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

ఇందిర‌మ్మ ఇంటి ల‌బ్ధిదారుకు మంజూరైన ఇంటికి అత‌ని సౌల‌ భ్యం ఆధారంగా అద‌నంగా 50 శాతం మేర నిర్మించుకునే అవ‌కా శం క‌ల్పించాల‌ని సీఎం అన్నారు. ల‌బ్ధిదారుకు ఆర్థిక‌ప‌ర‌మైన ఊర‌ట ల‌భించేందుకుగానూ సిమెంట్‌, స్టీల్ త‌క్కువ ధ‌ర‌ల‌కు అందేలా చూడా ల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు.

స‌మీక్ష‌లో రాష్ట్ర గృహ‌నిర్మాణ‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ ర్శులు వి.శేషాద్రి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్ర‌ట‌రీ సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, గృహ నిర్మాణ‌ శాఖ కార్య‌ద‌ర్శి జ్యోతి బుద్ద‌ప్ర‌కాష్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.