రేవంత్ కీలక వ్యాఖ్య, విద్యారంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం
Cmrevathreddy: ప్రజా దీవెన, హైదరాబాద్: విద్యా ప్రమా ణా లను మెరుగుపరచడాని కి విద్యారంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకా రం చుట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సామాజిక బాధ్యత గా గుర్తించినప్పుడే వ్యవస్థలో అవ సరమైన ప్రక్షాళన చేయడం సాధ్య పడుతుందని చెప్పారు. విద్యా రంగంపై శాసనమండలిలో జరిగిన ప్ర త్యేక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. 2021 నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో పేర్కొన్న గణాంకాలను సభలో వివరించారు.
సబ్జెక్టుల వారిగా తెలంగాణలో ఏ స్థానానికి పడిపోయిందీ తెలిపారు. ఏ సబ్జెక్టులోనూ కనీస ప్రాథమిక సామర్థ్యాన్ని ప్రదర్శించలేని వారి సంఖ్య పెరగడం, ప్రభుత్వ పాఠశా లల్లో చేరికల సంఖ్య తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా విధానం కొంత ఆందోళనకరంగా మా రింది. ఎవరు అవునన్నా కాద న్నా ఇందులో వాస్తవం ఉంది. వి ద్యా రంగంలో పడిపోతున్న ప్రమా ణాలను పెంచాలంటే కేవలం నిధు ల కేటాయింపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు.
అందరూ ఒక సామాజిక బాధ్యతగా భావించిన ప్పుడే సమస్యను పరిష్కరించగ లుగుతాం.విద్యా వ్యవస్థలో అవస రమైన మార్పులు, ప్రక్షాళన చేయ డానికి సూచనలు, సలహాలు ఇవ్వండి. అందరి సూ చనలతో సమ గ్రమైన ఒక పాలసీ డాక్యుమెంట్ను రూపొందించి చర్చి ద్దాం. పడిపోతు న్న ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ మేల్కొనకపోతే భవి ష్యత్తు తరాలకు మనం ద్రోహం చేసిన వారి మవుతాం.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ప్రక్షాళన చేయలేం. విద్యా రంగంలో ప్రమాణాలు పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారంలోకి రాగా నే, డీఎస్సీ ని ర్వహించి 10 వేల మంది టీచర్ ఉ ద్యోగాలను భర్తీ చేశాం. ఏళ్ల తరబ డి పెండింగ్లో ఉన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ను పూర్తి చేశాం. అ యితే, విద్యా ప్రమాణాలు పడిపో వడంలో కేవ లం ప్రభుత్వానిదే కా కుండా సమాజంపైన కూడా బాధ్యత ఉంది. సామాజిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపు ణ్యం పెంచాల్సిన అవసరం ఉంది.
రాజకీయ కోణంలో ఆలోచనలు చేసినన్ని రోజులు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయలేం.యువతలో నై పుణ్యం కొరవడి వెనుకబడిపోతు న్నారు. నైపుణ్యతలను పెంచడాని కి యంగ్ ఇండియా స్కిల్స్ యూ నివర్సిటీ (#YISU) ని ఏర్పాటు చే శాం. అలాగే, మూస పద్ధతిలో సా గుతున్న ఐటీఐలను సంస్కరిస్తూ కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి పలు కుతూ వాటిని అడ్వాన్స్డ్ టెక్నాల జీ సెంటర్లుగా (#ATC) అప్ గ్రేడ్ చేస్తున్నాం. వంద అసెంబ్లీ నియో జకవర్గాల్లో ఈ ఏటీసీలను ఏర్పా టు చేస్తున్నాం.
క్రీడాకారులను తయారు చేయడం, ఒలింపిక్స్ క్రీడలు లక్ష్యంగా యం గ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీలను ప్రారంభించబో తున్నాం. దీనికి సంబంధించి త్వరలోనే విధివి ధానాలను ప్రకటిస్తాం. కొత్తగూడెం లో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పా టు చేయాలని భావి స్తున్నామని వివరించారు.