Bhavita centers construction : ప్రజాదీవెన నల్గొండ : భవిత కేంద్రాల నిర్మాణ పనుల తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న భవిత కేంద్రం నిర్మాణం పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల.
ప్రకారం భవిత కేంద్రాలలో తప్పనిసరిగా ర్యాంపు, రైలింగ్, టాయిలెట్లు, తగు నీరు వంటి కనీస మౌలిక వసతులు ఉండేలా చూడాలని, ఆక్టివిటీ రూమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, భవిత కేంద్రాలు పూర్తిగా సద్వినియోగం అయ్యేలా నిర్మాణాలు చేపట్టాలని అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్ కు సూచించారు.
జిల్లా కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, డిఇఓ, తదితరులు ఉన్నారు.