–నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్
Collector J. Srinivas : ప్రజా దీవెన నల్లగొండ: సీఎంఆర్ చెల్లించని రైస్ మిల్లులపై కఠిన చ ర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ హెచ్చరిం చారు.గురువారం అయన తన ఛాంబర్ లో సీఎంఆర్ బ్యాంకు గ్యారంటీ తదితర విషయాలపై పౌరసరఫ రాల అధికారులు, రైస్ మిల్లుల సంఘం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.2023- 24 రబికి సంబంధించి ఇంకా కొంత మంది రైస్ మిల్లర్లు 9000 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ ను చెల్లించాల్సి ఉందని, మార్చి 10 లోగా ఎట్టి పరిస్థితులలో సీఎంఆర్ ను చెల్లించాలని ,లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పలుమా ర్లు సీఎంఆర్ విషయంలో హెచ్చరిం చినప్పటికి సీఎంఆర్ చెల్లించకపో వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్ల ర్లు నిర్దేశించిన సమయంలో సీఎం ఆర్ చెల్లించేలా పౌరసరఫరాల డిప్యూటీ తహసిల్దారులు సంబం ధించిన రైస్ మిల్లులోనే ఉండి సిఎంఆర్ చెల్లించే విధంగా చర్యలు తీసు కోవాలన్నారు.
బ్యాం కు గ్యారంటీల పై సమీక్షిస్తూ రైస్ మిల్లుల సంఘం ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు బ్యాంకు గ్యారంటీని వెంటనే సమ ర్పించాలని అన్నారు.ఈ సమా వేశంలో రానున్న సీజన్ సిఎంఆర్ కు సంసిద్ధం కావాలని ఆయన తెలిపారు.జిల్లా పౌర సరఫ రాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీ ష్ ,డిసిఓ పత్యా నా యక్, రైస్ మిల్లర్ల సంఘం అధ్య క్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివా సులు తదితరులు హాజర య్యా రు.