–కలెక్టర్ ఇలా త్రిపాఠి
–పరీక్షా కేంద్రం ఆకస్మికతనికి తనిఖీ
Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ :ఇంటర్ పరీక్షల సందర్బంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవర్ తో కలిసి ఆకస్మిఖంగా తనిఖీ చేశారు.
ప్రగతి జూనియర్ కళాశాలకు కేటాయించిన విద్యార్థులు, గురువారం పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటిండెంట్ తో అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఇంటర్ విద్యా శాఖ అధికారులు, చీఫ్ సూపరింటిండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులతో కోరారు.
అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.