Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Tripathi : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి

Collector Tripathi : ప్రజా దీవెన, మిర్యాలగూడ: మిర్యాలగూడ మున్సిపాలిటీతో పాటు, గ్రామీణ ప్రాంతంలో వేసవి లో తాగునీటికి ఇబ్బందులు లేకుం డా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ ము న్సిపల్ అధికారులు, ఎంపీడీవోను ఆదేశించారు.బుధవారం ఆమె మిర్యాలగూడ ఎంపీడీవో కార్యా లయంలో తాగునీటి సరఫరా పై ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ డివిజన్ వారి గా తాగునీటి పథకాలు, వనరు లు,బోర్లు, నల్ల కనెక్షన్లు, మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు, మరమ్మతులు ,వేసవి కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.

డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ పట్టణ ప్రాంత వార్డులలో ఎలాంటి తాగునీటి కొరత లేకుండా చర్య తీసుకోవాలని ఆన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే పరిష్కరించాలని ,వారి స్థాయిలో పరిష్కారం కానివి వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. తాగునీటి సరఫరాకై పంపులకు వినియోగిస్తున్న విద్యుత్తు వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు తాగునీటి పరిస్థితిని సమీక్షిం చాలని, మున్సిపల్ కమిషనర్ను, ఎంపీడీవోను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మిర్యాల గూడ మున్సిపల్ పరిధిలో డంపిం గ్ యార్డ్ వివరాలను అడిగి తెలు సుకున్నారు.ఈ సమావేశంలో ఎంపీడీవో శర్మ, ఈఈ వెంకన్న, అసిస్టెంట్ ఇంజనీర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.