Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Tripathi : విద్యార్థి దశ నుండే లక్ష్యం అవసరం

 

–నిడమనూరు గురుకుల పాఠశాల ఆకస్మికతనిఖీలో కలెక్టర్

— వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచన

Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ :విద్యార్థి దశనుండే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు బోధించారు. గురువారం ఆ మె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీ రామానంద తీర్థ ఇన్స్టి ట్యూట్ లో ఏర్పాటుచేసిన నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల,కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు.

ముందుగా జిల్లా కలెక్టర్ తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థుల తెలివి తేటలను పరీక్షించారు. గణితం, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్ సబ్జె క్టులపై వివిధ రకాల ప్రశ్నలను అడిగారు. సరైన సమాధానాలు చెప్పి న పిల్లలకు చాక్లెట్లను పంపిణీ చేశారు.


ఆయా తరగతి గదులలో విద్యార్థినిలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎండాకాలంలో విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవాలని, ఎట్టి పరిస్థితులలో జంక్ ఫుడ్ తినవద్దని చెప్పారు.పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ తక్కిన పరీక్షలను బాగా రాయాలని చెబుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం పాఠశాల విద్యార్థులనుద్దేశించి మా ట్లా డుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుండే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చే సుకొని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని బోధించారు.