— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజా దీవెన, మిర్యాలగూడ: ఆడపిల్లలు శారీరకంగా, మానసికం గా ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంపీడీవో కార్యాల య సమావేశ మందిరంలో ఐసిడి ఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో- బేటి పడావో కార్యక్రమం కింద కౌమార బాలికలకు ఉద్దేశించి రుతుస్రావం, వ్యక్తిగత శ్రద్ధ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆడవారి ఆరోగ్యానికి రుతుక్రమం అనేది చాలా ముఖ్యమని, ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు. ఆడవారూ తీసుకునే పౌష్టికాహారం, ఆరోగ్యం పైనే రుతుస్రావం పునరు త్పత్తి ఆధారపడి ఉంటాయని, అం దువల్ల దీనిని దృష్టిలో ఉంచుకుని మంచి పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. కౌమార బాలికలు జంక్ ఫుడ్, చిరుధాన్యా ల వంటివి తిన వద్దని చెప్పారు. ఆడవారు మగవా రి కన్నా తక్కువ అనే భావాన్ని వది లేయాలని ,ఆడవారు దేనిలోనూ తక్కువ కాదని ఆమె తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, సిడిపివోలు, తదితరులు ఈ కార్య క్రమానికి హాజరయ్యారు .