Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Tripathi : భూభారతి సదస్సుల్లో సమస్యల గుర్తింపు

–ఇప్పటికి 11 మండలాలలో అవగాహన సదస్సులు పూర్తి

–దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలలో సమస్యలు

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Collector Tripathi :ప్రజాదీవెన నల్గొండ: భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా మ్యుటేషన్లు, డి ఫామ్ పట్టాలు, అన్ సైన్డ్ ఖాతాలకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలిపారు.మంగళవారం మంత్రి హైదరా బాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ఆర్ఎస్, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.

భూ భారతి చట్టం పై జిల్లాలలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల పై జిల్లా కలెక్టర్ల అభిప్రాయాన్ని మంత్రి కోరిన సందర్భంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తన పరిశీలనలను మంత్రికి వివరిస్తూ నల్గొండ జిల్లాలో మొత్తం 33 మండలాలకు గాను, ఇప్పటివరకు 11 మండలాలలో భూ భారతిపై అవగాహన సదస్సులు పూర్తి చేయడం జరిగిందని, ఆయా మండలాలలో సదస్సుల నిర్వహణ సందర్భంగా, ప్రత్యేకించి దేవరకొండ, నాగార్జునసాగర్ వంటి నియోజకవర్గాలలో డి ఫామ్ పట్టాలు, ఆన్ సైన్డ్ ఖాతాలు, మ్యుటేషన్ల కు సంబంధించి సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విషయాలన్నింటిపై త్వర లోనే పైలెట్ ప్రాజెక్టు జిల్లాల కలెక్టర్లతో నిర్వహించే సమావేశంలో సమీక్షించి తగు చర్య తీసుకుంటామని మంత్రి తెలిపారు. తక్కిన జిల్లాలలో ఎంపిక చేసిన పైలెట్ మండలాలలో చేపట్టే భూ భారతి చట్టం అమలుపై రెండు రోజులపాటు హైదరాబాదులో వర్క్ షాప్ నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి తో చర్చించిన అనంతరం వర్క్ షాపు వివరాలు తెలియజేయడం జరుగుతుందని, ఈలోగా పైలెట్ మండలాల నుండి తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్లను వర్క్ షాప్ కు పంపించేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు.

ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో డి ఫామ్ పట్టాలకు సంబంధించి ఒరి జినల్ గా ఉన్న భూమి, పట్టాలు ఇచ్చిన భూమి, తదితర పూర్తి వివ రాలను తయారు చేయాలని తెలిపారు. భూభారతి అవగాహన సద స్సుల అనంతరం పైలెట్ మండలాలతో పాటు, తక్కిన మండ లాల లో సైతం భూ భారతి చట్టం అమలుకు సంబంధించి నిర్వహించే వర్క్ షాపు అవసరాన్ని ఆయన జిల్లా కలెక్టర్ల ద్వారా అడిగి తెలుసు కున్నారు. ఈ నెల 30 నాటికి పైలెట్ ప్రాజెక్టు పూర్తవుతుందని, ఈ 4 పైలెట్ మండలాల అనుభవంతో భూ భారతి చట్టాన్ని ఇంకా పకడ్బం దీగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

భూ భారతి చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని అమలు చేసే బాధ్యత పూర్తిగా అధికారులపై ఉందని, అందువల్ల అధికారులు చట్టం పట్ల పూర్తిగా లోతుకు వెళ్లి అధ్యయనం చేసి రైతులకు మేలు చేయాలని కోరారు.

ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షిస్తూ..

ఇందిరమ్మ ఇండ్ల సమీక్ష సందర్భంగా మొదటి దశ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ప్రతి 200 ఇండ్లకు ఒక గెజిటెడ్ అధికారి నియామకం, నియోజకవర్గాల వారిగా ఇన్చార్జి అధికారుల నియా మకం, ఆయా గ్రామాల వారీగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తూ ఇన్చార్జి మంత్రి ఆమోదంతో జాబితాల తయారీ, తదితర విషయా లపై ఆయన సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఇండ్ల కేటాయిం పులు చేసి ఇన్చార్జి మంత్రి ఆమోదంతో జాబితాలను పంపించాల న్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పనులకు రెవెన్యూ, తాగునీటి సరఫరా శాఖల సిబ్బంది సేవలను తీసుకోవద్దని మంత్రి తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పరిశీలన పూర్తి నాణ్యతగా ఉండా లని, జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను అందుబాటులో ఉంచాలని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి గా ఐదు లక్షల రూపాయలను ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్న విషయాన్ని లబ్ధిదారులకు, ప్రజలకు తెలియజేయాలని, ఇదే విషయ మై ప్రతి మండలంలో ఒక నమూనా ఇంటిని కట్టించడం జరిగిందని, అవసరమైతే ఆ నమూనా ఇండ్లను చూపించే విధంగా చర్యలు చేప ట్టాలన్నారు.

పట్టణ ప్రాంత లబ్ధిదారులు పట్టణాలకు 5,6 కిలోమీ టర్ల దూరంలో ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తే వెళ్లేందుకు సుముకత చూపకపోవడం వల్ల పట్టణ ప్రాంతంలోని మురికివాడల్లో కనీసం 500 ఇండ్లు ఒకే చోట నిర్మించే విధంగా జిల్లా అధికారులు గుర్తించాలని, ప్రత్యేకంగా పూర్వపు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో మూడు అంతస్తుల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మే 5 లోగా ఇదివరకే నిర్దేశించిన ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని ఆయన ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టాలని, వర్షాకాలం ప్రారంభమవుతే లబ్ధిదారులు ఇబ్బంది పడతారని తెలిపారు. నిర్దేశిం చిన సమయంలో గా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి తక్షణమే నిధులు విడుదల చేయడం జరుగుతుందని, ప్రతి శనివారం సంబంధిత జిల్లా కలెక్టర్లు వివరాల ను అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారం గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ ద్వారా నిధులను విడుదల చేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశా రు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి ఆయా అంశాలపై సూచనలు చేశారు.

జిల్లా నుండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పాటు, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవోలు వై.అశోక్ రెడ్డి, రమణా రెడ్డి, శ్రీదేవి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, రెండవ యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.