— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు గాను నర్సరీల పెంప కాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె మండలాల ప్రత్యేక అధికారులు ,ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంసిఓలతో వివిధ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ముందుగా బ్యాగులలో మట్టి నింపడాన్నీ పూర్తిచేయాలని షెడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవాలని, నర్సరీల పెంపకానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని, నీడ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా నర్సరీలలో ఏ మొక్కలు ఎంత శాతం పెంచాలో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నర్సరీల పెంపకంలో చివరిగా నిలిచిన మండలాల అధికారులతో ఆమె ప్రత్యేకంగా సమీక్షిస్తూ నర్సరీల పెంపకం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి నర్సరీల పెంపకం పై మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో 69 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల జాబితా పరిశీలనపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ జనవరి 26 న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన 31 గ్రామపంచాయతీల మాదిరిగానే, తక్కిన గ్రామాలలో జాబితాల పరిశీలనను ఈనెల 20 లోపు పూర్తి చేయాలని చెప్పారు. ఎంపీడీవోలు, ఎంఎస్ఓ లు ఇందిరమ్మ ఇండ్ల జాబితా పరిశీలన, గ్రౌండింగ్ ,తదితర అంశాలను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. జిల్లా స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని కిందిస్థాయి వరకు తీసుకువెళ్లాలని తెలిపారు. జనవరి 26 న ప్రారంభించిన 31 గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శిలు, మేస్త్రీలకు ఇదివరకే వెరిఫికేషన్ గురించి తెలియజేయడం జరిగిందని, అలాగే తక్కిన గ్రామాలలో జాబితా పరిశీలన ఉండాలని అన్నారు. అర్హుల జాబితా పరిశీలనలో ఎట్టి పరిస్థితులలో తప్పు చేయవద్దని ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు .31 గ్రామాలకు సంబంధించి మొదటి జాబితాలో ఆమోదించబడిన జాబితాను తక్షణమే కలెక్టర్ లాగిన్ కు పంపించాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ లో భాగంగా ముందుగా గుడిసెలు,పూర్తిగా కొత్తగా మార్కౌట్ ఇచ్చిన వాటిని మాత్రమే తీసుకోవాల ని ,చెల్లిం పులు దశలవారీగా ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీవో లు, ఎంపిడిఓలు మండలాల ప్రత్యేక అధికారులు, ఏపీ ఓ, ఎంసీఓ లు ఈ టెలికాన్ఫరెన్స్ కు హాజరయ్యా రు.