Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Commissioner Police Rangaswamy : మానవత్వం లేని మనషులు, ప్రి యుడితో కలిసి మొగుడి హత్య

–అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నా డని దారుణం
–ప్రియుడుతో కలిసి భర్తను హత మార్చి డ్రామాలాడిన వైనం
–షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంగస్వామి

Commissioner Police Rangaswamy : ప్రజా దీవెన, షాద్ నగర్: సమాజం లో రోజురోజుకు మానవ విలువలు మంటగలిసి పోతున్నాయి. స్వార్ధ ప్రయోజనాలకు తలొగ్గి వెనుక ముందు చూడకుండా మృగాళ్ల వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే
తమ అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని కట్టుకున్న భర్త నే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన సంచల నం రేకెత్తించింది. భర్తను హత మా ర్చి చివరకు తానే పోలీసులకు కని పించడం లేదని ఫిర్యాదు చేసి పో లీసులకు సైతం ట్విస్ట్ ఇచ్చింది.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసి స్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏ సిపి) ఎన్ సిహెచ్ రంగస్వామి తెలి పిన వివరాల ప్రకారం వివరాలు ఇ లా ఉన్నాయి. ఫరూక్ నగర్ మం డలం చిన్న చిల్కమర్రి గ్రామానికి చెందిన ముద్దునోళ్ల ఎరుకలి మౌ నిక తన భర్త ఎరుకలి యాదయ్య (32) గత ఫిబ్రవరి 19వ తేదీన కని పించకుండా పోయాడని షాద్ న గర్ పోలీస్ స్టేషన్ లో మౌనిక ఫి ర్యాదు చేసింది. పట్టణ విజయ్ కుమార్ ఎఫ్ఐఆర్ నెంబర్ 205/ 2025 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసు లు శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, స్థానిక ఏసిపి సిహె చ్ రంగస్వామి ఆధ్వర్యంలో పట్టణ సీఐ విజయ్ కుమార్ ఎస్సైసుశీల, హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్, సిబ్బంది సువర్ణ నరేందర్ రాజేష్ కరుణాకర్ ల బృందం ఈ కేసులో విచారణ మొదలుపెట్టినట్లు ఎసిపి రంగస్వామి తెలిపారు. అయితే ఈ కేసులో ఎరుకలి మౌనికకు ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామా నికి చెందిన ఎరుకలి అశోక్ (ఆటో డ్రైవర్) తో అక్రమ సంబంధం సా గుతోంది. 8 సంవత్సరాల క్రితం ఎ రుకలి మౌనికతో యాదయ్యకు వి వాహం జరిగింది. మృతుడికి ఇద్ద రు పిల్లలు. మృతుడు కూలి పని చే సుకుంటూ వచ్చిన డబ్బులతో మం దు తాగుతూ ఇంటి అవసరాలకు డబ్బులు ఇవ్వకుండా సంసారం విషయంలో ఎరుకలి మౌనికకు తరచు గొడవ జరిగేది. చిలకమర్రి గ్రామం పక్కన గల రాఘవేంద్ర పత్తి కంపెనీలో పనికి వెళ్తున్న మౌనికకు అదే కంపెనీలో ఆటో డ్రైవర్ గా ప ని చేసే ఎరుకలి అశోక్ తో పరిచ యం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీ సిందని ఏసీపి తెలిపారు.

మౌనిక భర్త యాదయ్య తరచూ కొ డుతున్నాడన్న సమాచారంతో అ శోక్, మౌనికలు కలిసి తమ అక్రమ సంబంధానికి అడ్డు లేకుండా చే యాలని ఉద్దేశంతో ఫిబ్రవరి 18వ తేదీన సాయంత్రం ఏడు గంటల స మయంలో అశోక్ మృతుడు యా దయ్యను తన బాబాయి యొక్క ఊరు రామంజపూర్ లో విందు ఉందని వెంట తీసుకువెళ్లాడు. యాదయ్య మౌనికలను ఆటోలో తీసుకెళ్లిన అశోక్ రాత్రి 11 గంటల సమయంలో గూడూరు గ్రామం పె ద్దగట్టు తాండ దాటిన తర్వాత రో డ్డు పక్కన ఆటో నిలిపి నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి బాగా మ ద్యం తాగించారు. బాగా మద్యం తాగిన యాదయ్య నిద్రల్లోకి జా రుకోగానే ఒక వేట కొడవలితో మృ తుడి గొంతు కోసి దారుణంగా హ త్య చేశారు. అంతేకాకుండా తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను అత నిపై పోసి శవాన్ని కాల్చినట్లు ఎసిపి రంగస్వామి తెలిపారు.

నిధితులను పట్టుకున్న వైనం… నేరం జరిగాక ఇరుకలి మౌనిక అశోక్ లు పట్టణంలోని అ య్యప్ప కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారనీ ఎసిపి పేర్కొన్నారు. వీరిపై అను మానం వచ్చిన పోలీసులు దర్యా ప్తులో భాగంగా ఏప్రిల్ 23వ తేదీన ఇరువురిని షాద్ నగర్ పోలీస్ స్టేష న్ కు తీసుకువచ్చి విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తడ బడి ఉన్న వాస్తవ విషయాలను ఒ ప్పుకున్నారు అని ఏసిపి తెలిపా రు.

ఈ సందర్భంగా ఎక్కడ హత్య చేసి శవాన్ని పాతిపెట్టారు అక్కడికి నేర స్తులను తీసుకువెళ్లి వాస్తవాలు తె లుసుకున్నట్లు ఏసీపి తెలిపారు. అప్పటికే శవం పూర్తిగా ఎముకల గూడుగా మిగిలిందని సదరు ఎ ముకలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఒక ఆటో, వేట కొడవలి హత్యకు ఉపయోగిం చిన వస్తువులను సీజ్ చేసినట్లు ఏసీపి రంగస్వామి తెలిపారు. అక్ర మ సంబంధం నేపథ్యంలోనే ఎరు కలి యాదయ్యను దారుణంగా హ తమార్చి చంపారని, నిందితులు నేరం ఒప్పుకోవడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలి స్తున్నట్లు రంగస్వామి తెలిపారు.

ఈ కేసులో చాకచకంగా పనిచేసిన సీఐ విజయ్ కుమార్, ఎస్సై సు శీల, హెడ్ కానిస్టేబుల్ విజయ భా స్కర్ సిబ్బంది సువర్ణ నరేందర్ రా జేష్ కరుణాకర్ లకు తగిన రివా ర్డులను ఇప్పించేందుకు పై అధి కారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ మీడియా సమా వేశంలో ఎస్ఐ దేవరాజ్ తదిత రులు పాల్గొన్నారు.