కుటుంబ సర్వే తీరును పరిశీలించిన రాష్ట్రస్థాయి బృందం
ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్రభు త్వం అత్యంత ప్రతిష్టా త్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (family survey) తీరును రా ష్ట్ర స్థాయి బృందం శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించి పరిశీలిం చింది.
రాష్ట్ర స్థాయి బృందం (State level team) అధ్యక్షులు రవిచంద్ర నాయకత్వంలో ఈ బృందం ముందుగా దేవరకొండ డివిజ న్ లోని, దేవరకొండ (devarakonda) మండలం కట్టకొమ్ముతాండలో స ర్వే తీరును పరిశీలించింది. సర్వే నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్లు (e numaraters), కుటుంబ యజమానులతో పాటు, ప్రజల తో ఈ బృందం సర్వే గురించి ముఖాముఖి ( face to face) మాట్లాడి సర్వే వివరాలను తెలుసుకున్నారు.
సర్వే వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని, అడగగా,కుటుంబ యజమానులు నేనావత్ జుమాలి, మరో యజమాని నేనావత్ దసృ లు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, సర్వేకు వచ్చిన వారు వివరాలు, ఆధార్ (adharcard) వంటివి అడగగా వివరా లను చెప్తున్నామని తెలిపారు. దేవరకొండ మున్సిపాలిటీలోని (m uncipality) రెండవ వార్డులో సైతం రాష్ట్ర బృందం సర్వే తీరును పరిశీ లించింది. ఇక్కడ రెండవ బ్లాక్ ఎన్యుమరేటర్ చంద్ర మౌళి చే స్తున్న సర్వే ప్రక్రియను దగ్గరుండి బృందం పరిశీలించింది.
అనంతరం సర్వే చేసిన ఫారాలను ( servey forms) మున్సి ప ల్ కార్యాలయంలో ట్రంకు పెట్టెలలో భద్రపర చగా వాటిని రవిచంద్ర బృందం పరి శీలించి సంతృప్తి వ్యక్తంచేసింది. జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, దేవరకొం డ ఆర్డిఓ ఎస్. రమణా రెడ్డి, తహ సిల్దార్ సంతోష్ కిరణ్ ,దేవరకొండ మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ తదితరులు రాష్ట్ర బృందం వెంట ఉన్నారు.
Comprehensive Family Survey