Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Congress Support for Workers : కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుంది

–మేడే వేడుకలలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి

Congress Support for Workers :ప్రజాదీవెన నల్గొండ :కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో పనిచేసే కార్మికులకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అన్నారు. మే డే సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్ టియుసి), డిఎంహెచ్ఓ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐఎన్ టియుసి), డీఈఓ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం (ఐఎన్ టియుసి) ఆధ్వర్యంలో జరిగిన మేడే ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు.

వివిధ రంగాలలో పనిచేస్తున్న అర్హులైన కార్మికులకు ఇందిర ఇండ్లు మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న, పెరిక కళ్యాణ్, ఎర్ర శ్రీనివాస్, నాంపల్లి శ్రీను, మోయిన్, మర్రి యాదమ్మ, పూలమ్మ, పబ్లిక్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు భైరబోయిన బిక్షం, నరసింహ చారి, వెంకట్ రెడ్డి, నలిని, యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.