Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mallikharjuna kharge: బీజేపీ పాలనలో భ్రష్టు పట్టిన దేశం

దేశ పరిరక్ష ణకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో మోడీని తప్పించి దేశాన్ని రక్షించా ల్సిన సమయం ఆసన్న మైందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే పిలుపుని చ్చారు.

దేశ సంపదను కుబేర మిత్రులకు అప్పగించారు
ఆయన అబద్ధాలకు అంతులేకుండా పోతోంది
భువనగిరిలో కిరణ్ కుమార్, ఎమ్మెల్సీగా మల్లన్న ను గెలుపించా లి
నకిరేకల్ సభలో ఏఐసీసీ అధ్య క్షుడు ఖర్గే

ప్రజా దీవెన, నకిరేకల్: దేశ పరిరక్ష ణకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో మోడీని తప్పించి దేశాన్ని రక్షించా ల్సిన సమయం ఆసన్న మైందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే పిలుపుని చ్చారు.బిజెపి పార్టీ దళి తులు, గిరిజనుల రిజర్వేషన్లు తీసివేయ డం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కాపాడటానికి చివరివ రకు పోరాటం చేస్తుందన్నారు. 10 సంవత్సరాల్లో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను వారి మిత్రులకి అప్పనంగా కట్టబెట్టార న్నారు.

బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ధ్వంసం చేసింద న్నారు. పన్నులు వేసి మిమ్మల్ని దోచుకున్నట్టే ప్రభుత్వా న్ని కూడా దోచుకున్నారన్నారు. తెలం గాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులోన్నే మహి ళలకు ఉచ్చిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించటం జరిగింద న్నారు. ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు పెంపు, గృహాలకు 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇప్పటికే అందించామని, మిగిలిన హామీలు కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. 2024 ఆగస్టు 15 వరకు రైతులకు రూ. 2 లక్షల రూణమాపి చేస్తామన్నారు. కేసీఆ ర్,బిజెపి గురించి ఏమి మాట్లా డటంలేదన్నారు.

మోడి మాటలను చూసి ప్రజలు నవ్వుతున్నార న్నారు. ఆదాని, అంబానీ మీదికి ఈడీ ని మోడీ పంపగలడా అని ప్రశ్నించారు. తెలంగాణలో బిజెపికి ఒక్క సీటు కూడ రావద్దన్నారు. స్వాతంత్యం కాంగ్రెస్ పార్టీ తెచ్చిం దనీ, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పారు. పార్లమెంట్ ఎలక్షన్ లో భువనగిరి ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు. మోడిని తప్పిం చండని, దేశాన్ని రక్షించండని కోరారు. భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీ నాయకున్ని కాదని, మీ సేవకుణ్ణి అని పార్టీలో ఒక చిన్న యువజన కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న నాకు కాంగ్రెస్ ఎంపి అవకాశం ఇచ్చింద న్నారు.

రాష్ట్రంలో నకిరేకల్ నియో జకవర్గంనుండే కాంగ్రెస్ అభ్యర్థుల్లో అత్యధిక మెజారిటీ వచ్చింది అంటే ఆ ఘనత మీదేనన్నారు. బిఆర్ ఎస్, బిజెపి ప్రభుత్వాలు పదేళ్ళు రాష్ట్రానికి ఏమి చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ దీపదాసు మున్షి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జీ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Corrupt country under BJP rule