— వివరాలు వెల్లడిoచిన సిపి సివి ఆనంద్
CP CV Anand : ప్రజా దీవెన హైదరాబాద్,ఫిబ్రవరి: హిమాయత్ నగర్ దోపిడీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. తక్కువ సమయంలో కేసును ఛే దించి శభాష్ అనిపించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దోపిడీ జరిగిన వెం టనే అన్ని డిపార్ట్మెంట్స్ అప్ర మత్తమయ్యి నిందితులను పట్టు కోవడం జరిగిందని తెలిపారు. మూడు కోట్ల రూపాయల సొత్తు దొంగిలించారని, సొత్తు విలువ బహిరంగ మార్కెట్ విలువ అయి దు కోట్లు పైనే ఉంటుందన్నారు. 11 తేదీన రోహిత్ కేడియా కూతు రు వివాహం కోసం దుబాయ్ వెళ్లా రని వీరి కుటుంబం ఆయిల్ బిజి నెస్ చేస్తుంటారన్నారు. ఉదయం వీరు కూతురు పెళ్ళికి దుబాయ్ వెళ్లారని చెప్పారు. మొలహు ముఖ్య , సుశీల్ ముఖ్య , బసం తిలు ఈ చోరీ చేసినట్లు తెలిపారు. నిందితులు గతంలో మర్డర్ కేసులో ఉన్నట్లు వెల్లడిరచారు. స్నేహలత అనే మహిళను హత్య చేసిన కేసు లో కోటీ రూపాయలు దోచుకున్న ట్లు తెలిపారు. మర్డర్ కేస్ నింది తులు ములుహు ముఖ్య, సుశీల్ ముఖ్యలు పరారీలో ఉన్నారని.
వీరు బీహార్ కు చెందిన వారన్నా రు. నమ్మకంగా కేడియా ఇంట్లో నమ్మకంగా పని చేస్తున్నట్టు నటిం చినట్లు వివరిచారు. కేడియా కు టుంబం దుబాయ్ వెళ్ళగానే సొత్తు మొత్తం దోచుకుని వెళ్లారని.. సీసీ ఫుటేజ్ ల ద్వారా ట్రాక్ చేస్తే సికిం దరాబాద్ నుంచి తెలంగాణ ట్రైన్ ద్వారా వెళ్లి నట్లు చెప్పారు. భూపా ల్, నాగ్ పూర్, పాట్న ప్రాంతాల్లో టీ మ్స్ పంపామని, నిందితులు నాగ్ పూర్ వెళ్లే సరికి మా టీమ్స్ అక్కడ చెక్ చేసి 11 వ తేదీ సాయంత్రం పట్టుకున్నట్లు వెల్లడిరచారు. ఆ సమయంలో వారు దొంగిలించిన సొమ్ము అంతా వారితోనే ఉందని సీపీ ఆనంద్ తెలిపారు అయిదు కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరు దోచు కున్న సొమ్ములో నగలు, డైమాం డ్స్, గోల్డ్ కాయిన్స్, ఇండియన్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ ఉందన్నారు.