–రీజనల్ మేనేజర్ కు సీపీఎం వినతి
CPM leaders : ప్రజాదీవెన నల్లగొండ : నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి నార్కట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను పునరుద్ధరించడంతోపాటు ప్రస్తుతం నడుస్తున్న నల్లగొండ డిపోకు చెందిన బస్సును గ్రామం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం సిపిఎం నాయకులు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు నారి ఐలయ్య, బండ శ్రీశైలం మాట్లాడుతూ కరోనాకు ముందు నార్కట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం 6.30 గంటలకు నార్కట్పల్లి నుంచి బయలుదేరి బ్రాహ్మణ వెల్లేముల, పలివెల, గుజ్జ, సర్వేల్ గ్రామాల మీదగా చౌటుప్పల్ కు వెళ్లి తిరిగి అదే గ్రామాల మీదగా నార్కట్పల్లికి చేరుకునేది అన్నారు. ఉదయం సాయంత్రం ఇలా రోజుకు రెండు పర్యాయాలు తిరిగేదన్నారు. ప్రస్తుతం నడుస్తున్న నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గ్రామం లోపలికి వెళ్లి హైదరాబాదులోని దిల్సు ఖునగర్ వరకు వేళ్లి తిరిగి వచ్చేదని పేర్కొన్నారు.
కరోనా సమయంలో బంధయిన ఈ బస్సులు తిరిగి నల్లగొండ డిపోకు చెందిన బస్సు ప్రారంభమైనప్పటికీ నార్కట్పల్లి డిపోకు చెందిన బస్సు ప్రారంభం కాలేదని తెలిపారు.వాణిజ్య పంటలకు కేంద్రమైన గుజ్జ గ్రామానికి బస్సు సౌకర్యాలు లేకపోవడం వల్ల పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు, విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు,వివిధ అవసరాల కోసం వెళ్లే ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. నార్కట్ పల్లి ఆర్టీసీ బస్సులు తిరిగి పునరుద్ధరించాలని, నల్లగొండ నుంచి వస్తున్న బస్సులు గ్రామంలోపలికి రప్పించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఎం నారాయణపురం మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, గుజ్జ మాజీ సర్పంచ్ చాడ నరసింహ,ఉప సర్పంచ్ వెలిజాల గోపిక,రైతు సంఘం నాయకులు బొమ్మగాని శంకరయ్య, మహిళా సంఘం నాయకురాలు కుకుడాల మంగమ్మ తదితరులు ఉన్నారు.