Cricket Association : ప్రజా దీవెన, హైదరాబాద్:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఉచిత పాస్ల విష యంలో నెలకొన్న వివాదం తాత్కా లికంగా సద్దుమణిగింది.ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతున్న సమ యంలో సన్రైజర్స్ హైదరాబా ద్,హైదరాబాద్ క్రికెట్ అసోసియేష న్ మధ్య వివాదం చెలరేగిన సంగ తి తెలిసిందే.టికెట్ల విషయంలో వి వాదం చోటు చేసుకుంది. లెక్కకు మించి టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంద ని సన్రైజర్స్ హైదరాబాద్ ఆరోపిం చింది. దీనిపై జట్టు యాజమాన్యం బహిరంగంగానే లేఖ రాయడం జరిగింది.
ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే, హైదరాబాద్ను వదిలి వెళ్లిపోతా మని సన్రైజర్స్ హెచ్చరించింది. అయితే సన్రైజర్స్ చేసిన ఆరోపణ లను హైదరాబాద్ క్రికెట్ అసోసియే షన్ ఖండిచింది. వివాదం పెద్దది కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వివాదంలోకి ఎంటరై సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమా న్యాన్ని హెచ్సీఏ బెదిరిస్తోందని వస్తోన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
క్రికెట్ మ్యాచ్లకు పాస్లు డిమాం డ్ చేస్తూ SRH యాజమాన్యానికి ఎవరైనా సమస్యలు సృష్టించడా నికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరిం చారు. నేపథ్యంలో దరాబాద్ క్రికెట్ అసోసియేషన్ , సన్రైజర్స్ హైదరా బాద్ మధ్య నెలకొన్న వివాదం స ద్దుమణిగింది.ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తామని సన్రై జర్స్ హైదరాబాద్ తెలిపింది. గతం లో లాగే అన్ని కేటగిరిల్లో పాసులు కేటాయించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోరింది. దీనికి సై తం సన్రైజర్స్ హైదరాబాద్ అంగీక రించింది.దీనిలో భాగంగానే హెచ్సీ ఏ, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతినిధులు సమావేశమయ్యారు. ఒప్పందం ప్రకారం 10 శాతం టికె ట్లు ఇవ్వడానికి SRH అంగీకరిం చింది.హెచ్సీఏకు టికెట్లు యథా విధిగా కొనసాగుతాయని SRH సీఈవో షణ్ముగం తెలిపారు. ఇరు వర్గాల మధ్య చర్చల అనంతరం ఈ వివాదానికి తాత్కాలికంగా ము గింపు పలికారు.ఈ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి విచా రణ జరుపుతోంది.
ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ, బీసీసీఐ మధ్య ఉన్న ఒప్పందాల అమలుపై విజిలెన్స్ దర్యాప్తు నివేదిక అనంత రం ప్రభుత్వ నిర్ణయం వెల్లడి కా నుంది. ప్రస్తుతం ఈ వివాదం ముగి సిపోవడంతో సన్రైజర్స్ హైదరాబా ద్లోనే కొనసాగనుంది.