Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Labor Exploitation :కాలుష్యాన్ని నివారించి శ్రమ దోపిడీని అరికట్టాలి

కాలుష్యాన్ని నివారించి శ్రమ దోపిడీని అరికట్టాలి

–పి ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి

Labor Exploitation :ప్రజాదీవెన నల్గొండ టౌన్ :
నల్లగొండ జిల్లాలోని సిమ్లెస్ ఆయిల్ ట్యూబులర్, ఆగ్రో, సాల్వెంట్, ఫార్మాస్యూటికల్, ఎక్స్ప్లోజీవ్స్, స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీలు వెదజల్లుతున్న వాయు, ద్రవ, ఘన కాలుష్యాలను అరికట్టి ప్రజల ప్రాణాలను నిలబెట్టడంతో పాటు ఆ యాజమాన్యాలు సాగిస్తున్న శ్రమ దోపిడీని అరికట్టాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి, ఉపాధ్యక్షులు నాగిళ్ల యాదయ్య, పన్నాల లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు బర్రె సంజీవ, ఉయ్యాల లింగస్వామి గౌడ్, బైరు వెంకన్నగౌడ్ డిమాండ్ చేశారు.

సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇళా త్రిపాఠికి నిర్దిష్టమైన పరిశ్రమల సమాచారాన్ని అందజేసి ఆ పరిశ్రమలు ప్రమాదకరంగా వెదజల్లుతున్న కాలుష్యాన్ని నివారించాలని వాటితో పాటు రెగ్యులర్, డైలీ కార్మికుల విషయంలో అత్యంత దుర్మార్గంగా శ్రమదోపిడి సాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.