Cyber crimes: ప్రజా దీవెన, కోదాడ : జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ (SP Sunpreet Singh IPS) ఆదేశాల మేరకు సోమవారం పట్టణ CI తలారి రాజు ఆధ్వర్యంలో స్థానిక సుగుణ ఇంటర్, డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపైన పోలీసు కళాభృందం తో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ (SP Sunpreet Singh IPS)అధ్వర్యంలో సైబర్ నేరాలపై (Cyber crimes) పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు.
ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ (Internet)ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,ATMకార్డ్ వివరాలు,OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై1930టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100కుసమాచారం ఇవ్వాలని తెలిపినారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను (Blue links) క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు.
యువత లోన్ యాప్ (Loan app)లకు దూరంగా ఉండాలన్నారు. పుట్టిన తేదీలను,ఫోన్ నెంబర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవద్దు అని సూచించారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు.అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన (Awareness)కల్పించారు. ఈ కార్యక్రమం నందు పోలీస్ సిబ్బంది కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ ASI చారి,సుగుణ కాలేజ్ ప్రిన్సిపల్ ధనీష్, పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ యాకూబ్ ,కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపి, క్రిష్ణ,చారి, నాగర్జున మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.