బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు అప్రమత్తంగా అధికారులు
–రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు
Cyberabadpolice: ప్రజా దీవెన, హైదరాబాద్: బ్రహ్మో త్సావా ల సమయంలో భక్తులు అ ధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉం డడం వల్ల భద్రతా పరమైన పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకో వాలని అధికారులను రాచ కొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశించారు.బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బం ది తమకు కేటాయిం చిన విధులను అత్యంత జాగ్రత్తగా నిర్వహించా లని, బ్రహ్మో త్సవాలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు.
మహాశివరా త్రి పర్వదినం సందర్భంగా జరగనున్న కీసరగుట్ట బ్రహ్మో త్సావాల నేప థ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లే కుండా, ప్రశాంతం గా జరిగేందుకు తీసుకోవలసిన భద్రతాపరమైన చర్యలు మరియు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చే యాల్సిన ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు బందో బస్తు విధుల్లో ఉన్న సివిల్, ట్రాఫిక్ మరియు ఇతర విభాగాల అధికా రులు మరియు సిబ్బందితో సమ న్వయ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, విఐ పీలతో పాటు సాధారణ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని, మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధు ల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్యబృం దం అప్ర మత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సౌక ర్యార్థం డాక్ట ర్ల బృందంతో పాటు అంబులెన్సు ను, బీపీ షుగర్ వంటి వాటితో పా టు ఇతర అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.
భక్తులతో పాటు బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది యొక్క క్షేమం కూడా తమ కు అంతే ముఖ్యమని, పోలీసు సిబ్బంది అను కోని పరిస్థితుల్లో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అంతే కాకుండా ప్రత్యేక వైద్య చికిత్స తీసుకుంటున్న సిబ్బందికి అవసరమ య్యే మందులు కూడా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సురక్షితమైన తాగునీరుతో పాటు వేసవి తాపానికి కొందరు వడదెబ్బకు గుర య్యే ప్రమాదం ఉంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు విస్తృతంగా అందు బాటులో ఉంచాలని సూచించారు.
పారిశుధ్య ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని, మహిళల కోసం ప్రత్యేకం గా మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసేలా చూడాలని సంబంధిత అ ధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణంలో అన్ని వైపులా ఏర్పా టు చేసిన సిసిటీవీ కెమెరాల ద్వా రా కమాండ్ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని, మహిళా భక్తుల రక్షణ కోసం షీ టీం బృందాలు కూ డా విధుల్లో ఉండాలని పేర్కొన్నా రు.
భారీసంఖ్యలో భక్తులు దైవద ర్శనం కోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికా రులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరి గే లా చూడాలని కమిషనర్ సూ చించారు. ఈ కార్యక్రమంలో మ ల్కా జ్ గిరి డిసిపి పివి పద్మజ ఐపి ఎస్, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, ఐటి సెల్ ఏసీపీ నరేందర్ గౌడ్ మ రియు ఇతర అధికారులు పాల్గొ న్నారు.