–వైద్య విద్యకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్ గా గుర్తింపు కు కృషి
–మెరుగైన వైద్య విద్యను అందిం చేందుకు చర్యలు చేపట్టాం
–తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరు గైన వైద్య విద్య అందించేందుకు ప్రాధాన్యం
— తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ప్రజా ఆరోగ్య భద్రతకు పెద్దపీట
–వైద్య రంగంలో ప్రక్షాళన చేయడా నికి శ్రీకారం
–కళాశాలలో మెరుగైన బోధన అం దించేలా నిరంతర పర్యవేక్షణ కొన సాగించాలి
–వైద్య విద్య కళాశాలల యాజమా న్యాలు, డీన్లు, ప్రిన్సిపాల్ లతో జరి గిన సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరో గ్య శాఖల మంత్రి దామోదర్ రాజ నర్సింహ
Damodar Raja Narsimha: ప్రజా దీవెన, హైదరాబాద్:
రాష్ట్ర వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజన ర్సింహ
(Damodar Raja Narsimha) హైదరాబాదు లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తన కార్యాలయం లో తెలంగాణ రాష్ట్రంలో ( telangana )ఉన్న ప్రై వేట్ వైద్య విద్య, డెంటల్ కళాశాల ల యాజమాన్యాలతో పాటు ఆ యా కాలేజ్ డీన్ లు, ప్రిన్సిపాల్ గార్లతో తెలంగాణ మెడికల్ ఎడ్యు కేషన్( medical education)శాఖ ఆధ్వర్యంలో నిర్వహిం చిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narsimha) మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రంలో నాణ్యమైన డాక్టర్ల ను అందించడమే లక్ష్యం గా సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం – వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో శ్రీకారం చుట్టామన్నారు. హెల్త్ ఎడ్యుకేషన్ కు (health education)తెలంగాణ బెస్ట్ డెస్టి నేషన్ గా గుర్తింపు కు కృషి చేస్తు న్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాల ల తో పాటు డెంటల్ కాలేజ్ లలో మెరుగైన వైద్య విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య విద్య అందించేందుకు ప్రాధా న్యత ఇచ్చామన్నారు. వైద్య రం గంలో ( health)ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు పూర్వ వైభవం తెస్తామ న్నారు.గతంలో ఉస్మా నియా, గాంధీ, కాకతీయ మెడికల్ కళాశాల లో వైద్య విద్య పూర్తి చేసుకున్న డాక్టర్లకు ఎంతో గౌరవం ఉండేద న్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో మెరుగైన వైద్య విద్య ను విద్యార్థులకు అందించేందు కు కృషి చేస్తున్నాం. వైద్య విద్య లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపడుతున్నామని ప్రైవేటు వైద్య కళాశాలల ( medical colleges)యాజమాన్యాలకు తెలిపారు. ప్రైవేట్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల దగ్గర అదనపు ఫీజులు వసూలు చేయరాదని సూచించారు. రాష్ట్రం లో ప్రజా ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహా (Damodar Raja Narsimha) వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల లు 28 ఉన్నాయన్నారు. ఈ కళాశాల లో 3690 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయన్నారు. (అందులో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో AIMS – 100 , ESI – 125 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయన్నారు.) ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మొత్తం. 3915 మెడికల్ సీట్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో PG సీట్లు 1320 ( రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలో 1148, కేంద్ర ప్రభుత్వం NIMS – 89, ESI – 83 సీట్లు ఉన్నాయన్నా రు. సూపర్ స్పెషాలిటీ పీజీ మెడిక ల్ షెడ్యూల్ 179 ఉన్నాయన్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలో 105, NIMS – 59, ESI – 15 సీట్లు ఉన్నాయన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Raja Narsimha) . ప్రైవేట్ యాజమా న్యంలో 28 మెడికల్ కళాశాలలో 4,600 ఎంబిబిఎస్ మెడికల్ సీట్లు ఉన్నాయన్నారు. వీటితోపాటు 21 ప్రైవేట్ కళాశాల లో 1566 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయన్నారు. వీటితోపాటు సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు 6 కాలేజీలలో 27 సీట్లు భర్తీ అవుతున్నాయని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ సమావేశంలో వెల్లడించారు. పారదర్శకంగా, నిరంతర పర్యవేక్షణలో వైద్య విద్య బోధన జరిగేలా కృషి చేస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Raja Narsimha) .
ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల యజమానులు, డీన్లు, ప్రిన్సిపాల్ లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి గారికి పలు సూచనలు చేశారు. వారు చేసిన సూచనల పట్ల సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. ప్రైవేటు వైద్య విద్య, డెంటల్ కళాశాల ల యజమానులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సానుకూలంగా విన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. AEBAS విధానం అమలులో కొన్ని కళాశాల ల్లో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని మంత్రి ఈ సమావేశంలో స్పష్టం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, స్పెషల్ ఆఫీసర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విమల థామస్ లు పాల్గొన్నారు.