Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dandampally Saroja : పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి

— దండంపల్లి సరోజ

Dandampally Saroja : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్గొండ పట్టణంలోని 11వ వార్డు అర్బన్ కాలనీలో మహిళా కూలీలతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా గ్యాస్ ధరలు మరొక 50 రూపాయలు పెంచడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వం కార్పోరేట్లకు వత్తాసు పలుకుతూ ప్రజలపై భారాలు మోపుతూ ధరలు పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ ఉపాధ్యక్షురాలు మొగిలిపాలెపు ఇందిరా, 11వ వార్డు కమిటీ అధ్యక్షురాలు గడిగల కళ్యాణి, కార్యదర్శి దూదిమెట్ల లింగమ్మ, సభ్యులు గడిగల సత్యమ్మ, వెంకటమ్మ, నిర్మల, కవిత, ప్రమీల, జ్యోతి, లింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.