–డీఈఓ కార్యాలయంలో ఘన సన్మానం
Madhusudhan Reddy Retirement : ప్రజాదీవెన, నల్గొండ టౌన్: విద్యారంగంలో 28 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించిన ఏదుళ్ళ మధుసూదన్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి పిఏగా కూడా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశాడని డిఈఓ బిక్షపతి అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి గా ఏదుళ్ళ మధుసూదన్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది మధుసూదన్ రెడ్డి, జ్యోతి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిఇఓ బిక్షపతి మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి విద్యాశాఖలో అంకితభావంతో పనిచేశాడని కొనియాడారు.
ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు పలు సమస్యల పరిష్కారానికి ఆయన వద్దకు వెళ్లిన మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేశాడని అన్నారు. ఎక్కడ పనిచేసిన క్రమశిక్షణ, అంతంత భావంతో పనిచేశాడని అన్నారు.
పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, విద్యాశాఖ ఎడి రమాచారి, ఏ సి జి ఈ యూసుఫ్ షరీఫ్, ఏఎంఓ రామచంద్రయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సత్తెమ్మ, డి సి ఈ బి
కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, యేసు ఆదినారాయణ, సూపరిండెంట్ మోహన్,
మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఎదుల్ల శ్రీధర్ రెడ్డి, కోమటిరెడ్డి పృధ్విధర్ రెడ్డి, ఏదుల వెంకట్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కాలం వెంకటరెడ్డి, మందడి నర్సిరెడ్డి, లింగాల అనిల్ రెడ్డి, జ్యోతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.