Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Department of Medicine: ముప్పై ఏళ్లు దాటితే ముప్పే..!

–రాష్ట్రంలో 23.29 లక్షల మందికి బీపీ, 12 లక్షల మందికి షుగర్‌
–ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో వెల్లడి, ప్రభు త్వానికి వైద్యశాఖ నివేదిక

Department of Medicine: ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 30 ఏళ్ల వయసు దాటినవారిలో పలువురు రక్తపోటు, మధుమేహం (Hypertension, diabetes) ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ రెండూ శరీరాన్ని రోగాల మయం చేస్తు న్నాయి. సైలెంట్‌ కిల్లర్‌గా మారి ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి. 30 ఏళ్లు దాటిన వారికి రాష్ట్ర వైద్య శాఖ (Department of Medicine) అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) స్క్రీనింగ్‌ను నిర్వహి స్తోంది. ఇప్పటికే రెండు విడతల స్క్రీనింగ్‌ పూర్తయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు చివరి వరకు చేసిన స్క్రీనింగ్‌లో 12.06 శాతం మంది బీపీ, 6.24 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్న విషయం బయటపడింది. ఆ వివరాలను తాజాగా సర్కారుకు నివేదిక రూపంలో అందించింది.

రాష్ట్రంలో 30 ఏళ్లుదాటిన వారు 1.93 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ చేయాలని వైద్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఇంటింటి సర్వే చేస్తున్నారు. దీంట్లో భాగంగా జరిపిన స్క్రీనింగ్‌లో 23,29,558 మంది (12.06 శాతం) అధిక రక్తపోటుతో, మరో 12,05,329 మంది (6.24 శాతం) షుగర్‌తో (sugar) బాధపడుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో 30 ఏళ్లు దాటిన వారిలో 26 శాతం మంది బీపీ, మరో 13 శాతం మంది షుగర్‌ బాధితులుం టారని వైద్య ఆరోగ్యశాఖ అంచ నా. ఇప్పటి దాకా చేసిన స్క్రీనింగ్‌ లో 12 శాతం మంది బీపీ బాధితు లు బయటపడగా, మరో 14 శాతం మందిని గుర్తించాల్సివుంది. అలాగే షుగర్‌ బాధితులకు సంబంధించి ఇప్పటి దాకా 6 శాతమే బయట పడగా, మరో 7 శాతం బాధితుల్ని గుర్తించాల్సి వుంది. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వైద్య ఆరోగ్యశాఖ (Department of Medicine_ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

బీపీ, షుగర్‌ (BP, sugar) బాధితుల్లో మెదక్‌ అగ్రస్థానం …అత్యధిక బీపీ, షుగ ర్‌ బాధితులు మెదక్‌ జిల్లాలో ఉ న్నారు. రాష్ట్రంలోనే ఆ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. 30 దాటిన వారిలో ఆ జిల్లాలో 4,22,773 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 89,427 మందికి బీపీ, 54,515 మందికి షుగర్‌ ఉన్నట్లు తేలింది. అంటే పరీక్షలు చేయిం చుకున్న వారిలో 22 శాతంమంది రక్తపోటు, 12.89 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు వెల్ల డైంది. ఇక రెండోస్థానంలో నిర్మల్‌ జిల్లా నిలిచింది. అక్కడ 3,94,803 మందికి టెస్టులు చేయగా, అందు లో 19.14 శాతం మందికి బీపీ, 9.68 మందికి షుగర్‌ ఉందని గుర్తిం చారు. మూడో స్థానంలో కామారెడ్డి జిల్లా నిలిచింది. ఆ జిల్లాలో 5,38 ,219 మందికి పరీక్షలు నిర్వహిం చగా.. 96,288 మందికి బీపీ, 61, 117 మందికి షుగర్‌ ఉన్నట్లు తేలిం ది. అంటే 18 శాతం మంది బీపీతో, 11.35 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 4వస్థానంలో నల్లగొండ జిల్లా నిలిచింది. అక్కడ 9,09,838 మందికి టెస్టులు చేశారు. అందులో 17.74 శాతం మందికి బీపీ (bp), 9.36 శాతం మందికి షుగర్‌ ఉందని తేలింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17 శాతం మంది బీపీతో, 9.77 శాతం మంది షుగర్‌తో బాధప డుతున్నట్లు వైల్లడైంది.

చాలామంది బీపీ, షుగర్‌ (BP, sugar) బాధితులకు తాము వాటి బారినపడ్డ సంగతే తెలియడం లేదు. గుర్తించిన వారిలో కూడా చాలామంది నిత్యం ఔషధాలను వాడటం లేదు. కేవలం 40 శాతం మందే రోజూ మందులు వేసుకుంటున్నట్లు వైద్యశాఖ పరిశీలనలో తేలింది. బీపీకి, షుగర్‌కు వేర్వేరుగా ట్లాబ్లెట్స్‌ (Tablets) వేసుకోవాల్సి రావడంతో కొంతమంది మర్చిపోతున్నట్లు వైద్యశాఖ గుర్తించింది. దీంతోపాటు ప్రతీ ఆరు నెలలకు పరీక్షలు చేసి, ఔషధాలను మార్చాల్సి ఉంటుంది. చాలామంది రెగ్యులర్‌గా టెస్టులు చేయించుకోవడం లేదు. దీంతో బీపీ, షుగర్‌ నియంత్రణ కావటం లేదని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

అసహజ జీవనశైలి (lifestyle) కారణ oగానే.. ప్రస్తుతం అసాంక్రమిక వ్యాధులు పెరుగుతున్నాయి. జీవ నశైలిలో మార్పుల కారణంగానే వీటి ముప్పు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బీపీ, షుగర్‌ మాత్రమే కాదు.. గుండె, కిడ్నీ జబ్బులు, సీవోపీడీ, క్యాన్సర్‌ (Heart, kidney disease, COPD, cancer) కేసులు కూడా తెలంగాణలో బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా 30 ఏళ్లలోపే పలువురు వీటి బారినప డుతున్నట్లు వైద్యులు చెబుతు న్నారు. ఆఫీసుల్లో తీవ్రమైన ఒత్తిడి మధ్య పని చేయడం, సమయానికి తినకపోవడం, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తినడం, శారీరక శ్రమ అసలు లేకపోవడం లాంటివి వీటికి ప్రధాన కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు.