Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Singareni Collieries: సింగరేణి బలోపేతమే ప్రజాప్రభుత్వ లక్ష్యం

–మారిన మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సంస్థ ఎదగాలి
–సింగరేణికి భవిష్యత్ ఆలోచన లేకపోతే భవిష్యత్ తరాలకు నష్టం
–కార్మికుల సంక్షేమంకోసం రూ.1 కో టి ప్రమాద బీమా సౌకర్యం
–సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికు లకూ బోనస్ చెల్లిసున్నం
–సింగరేణి సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ప్రజా దీవెన, భూపాలపల్లి:
Singareni Collieries: సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమాని క మైన సంస్థ, సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నా యని, సింగరేణి సంస్థ బలోపేతమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సాయంత్రం భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాల యంలోని సమావేశ మందిరంలో సింగరేణి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్ర మలు మరియు ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వరంగల్ పార్లమెంటు సభ్యు రాలు డాక్టర్ కడియం కావ్య, డిసిసి ప్రెసిడెంట్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కా ర్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రె డ్డి, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజిం గ్ డైరెక్టర్ బలరాం, జిల్లా కలెక్టర్ రా హుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో ఉపము ఖ్యమంత్రి మాట్లాడుతూ.. మారిన మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి సంస్థ ఎదగాలని అధి కారులకు సూచించారు. బొగ్గుతో పాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి సింగరేణి విస్తరించాలని సూచిం చా రు. సుమారు 45 వేలకు పైబడిన ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగసంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే సింగరేణి బలో పేతం కావడమే ప్రజా ప్రభుత్వ ల క్ష్యమని అన్నారు.

సింగరేణి లా భాల్లో ఉండి సంస్థ ఉద్యోగులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలన్నది ప్రభుత్వ ప్రధాన ఆలోచన అని తెలిపారు. గతంలో బొగ్గు రంగంలో సింగరేణి, కోల్ ఇండియాలది ఏకచత్రాధిపత్యం. కానీ, ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు రంగంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో మార్కెట్లో పోటీకి తట్టుకొని సింగరేణి నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ కంపెనీల బొగ్గు ఉత్పత్తి వ్యయం, ఆ కంపెనీలు బహిరంగ మార్కెట్లో బొగ్గు ఏ ధరకు అమ్ముతున్నాయి.

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం, బహిరంగ మార్కెట్ లో సింగరేణి బొగ్గుకు ఉన్న ధర ఎప్ప టికప్పుడు అధికారులు పోల్చుకోవాలని సూచించారు. ఈ ఉత్పత్తి వ్యయం, బహిరంగ మార్కెట్లో బొగ్గు ధరలకు సంబంధించిన వి రాలను సింగరేణి కార్మికులకు అవగాహన కలిగేలా మైన్స్ వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని, సింగరేణి కార్మికులు, అధికారులకు అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం సూచించారు.

సింగరేణికి భవిష్యత్ ఆలోచన లేకపోతే రాబోయే ముందు తరాలకు నష్టం చేసినట్టు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు గ్రామాలు ప్రభావితం అవుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ అంశంపై విచారణ చేయాలని, సింగరేణి మైన్స్ కోసం భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన జాబితాపై విచారించాలని అ ర్హుల జాబితా పంపాలని అధికారు లను ఆదేశించారు.

సింగరేణి కార్మి కుల సంక్షేమం కోసం రూ.1 కోటి రూపాయల ప్రమాద బీమా సౌక ర్యం ఇటీవల కల్పించామని గుర్తు చేశారు. సింగరేణిలోని శాశ్వత ఉద్యోగులకే కాదు కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తున్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. అనంతరం ఓసీ – 2 ఉప రితల గని ప్రదేశాన్ని వ్యూ పాయింట్ నుండి డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులు పరిశీలించారు.