Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: సుదీ ర్ఘకాలంగా పెండింగ్ లోని ఉన్న ఎల్ ఆర్ఎస్ లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం అమలులో వేగంపెంచాల ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు ప్రగతిపై బుధ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావే శంలో మంత్రులు పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలులో వేగం పెంచే కార్యక్ర మంలో భాగంగా 25 శాతం రాయి తీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్లాట్ కొనుగోలు దారులకు ఈ రాయితీని మార్చి 31 వరకు వెసులుబాటు కల్పించిం ది. దీంతో పాటు వ్యక్తిగతంగా ప్లా ట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకో ని వారికి, లే అవుట్లో పెద్ద సంఖ్య లో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల రెగ్యులరైజేషన్కు పలు వెసులు బాట్లు కల్పిస్తూ మంత్రులు నిర్ణ యం తీసుకున్నారు.
ఒక లేఅవుట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉం డి మిగిలిపోయిన 90 శాతం ప్లాట్ లకు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యు లరైజేషన్కు అవకాశం కల్పించారు. వీరు కూడా మార్చి 31 వరకు 25 శాతం రాయితీ పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి కూడా 31 లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తూ మం త్రులు నిర్ణయం తీసుకున్నారు. పేద ప్రజలు, గత నాలుగు సంవ త్సరాల నుంచి ఎల్ఆర్ఎస్ దర ఖాస్తుల పరిష్కారం గురించి ఎదు రు చూస్తున్నారు. పేదల ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వం కల్పించిన అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని ఈ సం దర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని రోజువారీగా సమీక్షిం చి నిర్ణయించారు.ఎల్ఆర్ఎస్ అమలులో భాగంగా పలు వెసలు బాట్లు కల్పిస్తున్న నేపథ్యంలో నిషే ధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉం డాలని,వీటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రులు అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుం డా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభ తరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచ నకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని దిశా నిర్దేశం చేశా రు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ప్ర భుత్వ కార్యాలయాల చుట్టూ తిర గకుండా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజే షన్ కోసం సంబంధించి సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లిం పులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసు కోవాలని సూచించారు.ఈ సమావే శంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాని యా, పురపాలక పట్టణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, రెవి న్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్ట ల్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రె టరీ జయేష్ రంజన్,స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.