Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Deputy CM Mallu Bhatti Vikramarka : జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

–డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Deputy CM Mallu Bhatti Vikramarka : ప్రజా దీవెన హైదరాబాద్: ప్రెస్ క్లబ్ హైదరాబాద్ 2025 సంవత్సరపు నూతన డైరీని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన క్యాంప్ కార్యాలయం లోశుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షే మానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించా రు. కాగ్రెస్ ప్రభుత్వమే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొ న్నారు. ప్రెస్ క్లబ్ కు స్థలాన్ని కేటా యించాలని అధ్యక్ష , ప్రధాన కార్య దర్శులు, పాలకమండలి ఉప ము ఖ్యమంత్రిని కోరారు.

 

ప్రభుత్వం నుంచి ప్రెస్ క్లబ్ కు ముఖ్యంగా జర్నలిస్టులకు పూర్తి సహాయసహ కారాలు అందిస్తామని భట్టి హామీ నిచ్చారు.సామాజిగూడా లోని ప్రెస్ క్లబ్ కు ప్రస్తుత స్థలం కేటాయింపు కోసం ఉపముఖ్యమంత్రి సానుకూ లంగా స్పందించారు.ఈ సంద ర్భంగా ప్రెస్ క్లబ్ పాలకమండలి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్ కి పూల మొక్కను బ హూకరించి శాలువాతో సత్కరిం చారు.ప్రెస్ క్లబ్ హైదరా బాద్ అధ్యక్షులు ఎల్.వేణుగోపాల నాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్. రవికాంత్ రెడ్డి,ఉపాధ్యక్షులు కె. శ్రీకాంత్రావు,సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్,కార్యవర్గ సభ్యులు బ్రహ్మండభేరి గోప రాజు,పి.బాపురావు,టి.శ్రీనివాస్ తదితరులు డైరీ ఆవిష్కరణలో పాల్గొన్నారు.