–ప్రాజెక్టు విశేషాల పై సమీక్ష
Deputy CM Mallu Bhatti Vikramarka : ప్రజాదీవెన నల్గొండ : నాగార్జునసాగర్ వద్ద ఉన్న ప్రఖ్యాత బుద్ధ వనం ప్రాజెక్టును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం సందర్శించారు. బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు బుద్ధవనం ప్రాజెక్టు విశేషాలను ఉపముఖ్యమంత్రి కి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి బుద్ధవనం లోని బుద్ధ పరిశ్రమ అనంతరం ధ్యానం చేశారు.
ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతిని వెలిగించారు. అనంతరం బుద్ధ వనంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం ప్రాజక్ట్ విశేషాలతో కూడిన వీడియో చిత్రాన్ని ఉప ముఖ్యమంత్రి తిలకించారు. ఉప ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర జెన్కో సిఎండి డాక్టర్ హరీష్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తదితరులు ఉన్నారు.