–రుణమాఫీపై రైతులు చేపడుతు న్న ఆందోళనకు తమ మద్దతు
–నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
Dharmapuri Arvind: ప్రజా దీవెన, నిజామాబాద్: ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) వైఫ ల్యాలపై, రుణమాఫీపై రైతులు చేప డుతున్న ఆందోళనకు తమ సంపూ ర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శుక్ర వారం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని బీజేపీ జిల్లా పార్టీ కార్యా ల యంలో (BJP District Party Office)ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అర వింద్ మాట్లాడుతూ ఎన్నికల్లో సా ధ్యం కాని హామీలను ఇచ్చి రైతు లను, మహిళలను, యువతను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)పూర్తిగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. రైతు లందరికీ రుణమాఫీ చేస్తామని కల్ల బొల్లి మాటలు చెప్పి కేవలం 30శా తం మంది రైతులకు రుణమాఫీ చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తి అని ఎద్దేవా చేశారు. జేబులు నింపు కోవడం తప్ప ప్రజా సంక్షేమంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు. గత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రుణ మాఫీ చేసిన తీరు అభినందనీ య మని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రజల్లో రేవంత్ రెడ్డి (revanth reddy) సర్కారుపై రోజురోజుకీ అసహనం పెరిగి పోతుందన్నారు. వడ్డీలేని రుణాలు ఇచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. తెలం గాణ రాష్ట్రానికి కేసీఆర్ చిప్ప చేతికిచ్చిందని విమర్శించారు. కేసీ ఆర్ లాగే రేవంత్ కూడా అబద్ధాలు చెబుతూ కాలం వెళ్ళదీస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ (farmers) ఆంక్షలు లేని రుణ మాఫీని వెంటనే ఇవ్వాలని డిమాం డ్ చేశారు. రైతు సంక్షేమాన్ని మరి చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐక్య కా ర్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ చేపడుతున్న ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు తెలుపు తున్నట్లు ఎంపీ ధర్మపురి అర వింద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, పోతాన్కర్ లక్ష్మీనారాయణ, బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.