— అధికారులతో ప్రత్యేక సమావేశం
National Program Launch : ప్రజాదీవెన నల్గొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగాంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి అధికారులతో సమావేశమయ్యారు.
జిల్లా అభివృద్ధికి అధికారులు ఎప్పటిలాగే కృషి చేయాలని, ప్రభుత్వ ప్రాధామ్యా పథకాల అమలతో ఎప్పటికప్పుడు నల్గొండ జిల్లా ను ముందుంచేలా చూడాలని కోరారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో రానున్న 100 రోజులలో చేపట్టనున్న కార్యక్రమాలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై ఏర్పాటు చేసిన ర్యాలీని మున్సిపల్ కార్యాలయంలో
ప్రారంభించి, ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ, పిడి రాజకుమార్, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలాల్, తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.