— ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : పదో తరగతి పరీక్షలలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా, కొండమల్లెపల్లి కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.
పరీక్ష కేంద్రంలో పోలీస్ భద్రత, పరీక్షకు హాజరైన విద్యార్థులు, పరీక్ష కేంద్రం చుట్టుపక్కల 144 సెక్షన్, జిరాక్స్ కేంద్రాల మూసివేత, పరీక్ష కేంద్రంలో తాగునీరు, ఓ ఆర్ ఎస్ పాకెట్లు, ప్రథమ చికిత్స ఏర్పాట్లు, తదితర అన్ని వివరాలను పరీక్ష కేంద్రం చీఫ్ సూపురింటిండెంట్ ద్వారా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పరీక్షలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సవ్యంగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు.
దేవరకొండ ఎఎస్పీ మౌనిక, ఆర్డిఓ రమణారెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.