— నూటికి నూరు శాతం పేదలకు మేలు
–9 ఎం ఎల్ ఎస్ పాయింట్ల వద్ద వేయింగ్ బ్రిడ్జిల ఏర్పాటు
–తప్పులకు ఆస్కారం లేకుండా చర్యలు
— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
— ఇందుగులలో లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : సన్న బియ్యం పథకం పేదలకు మేలు జరిగే పథకమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలం, ఇందుగుల గ్రామంలో సన్న బియ్యం పథకం లబ్దిదారు జానకమ్మ ఇంట్లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌరసరఫరాల ఇన్చార్జి అధికారి హరీష్ కుమార్ లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని, గతంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కింద దేశవ్యాప్తంగా బియ్యం పంపిణీ చేసేదని, ,
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బియ్యం పంపిణీ జరిగిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యాన్ని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నదని,
కార్యక్రమమని అన్నారు. సన్న బియ్యం పంపిణీ పట్ల లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారన్నారు. సన్న బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేసేందుకు జిల్లాలోని సుమారు 1000 రేషన్ షాపులకు నూటికి నూరు శాతం బియ్యాన్ని తరలించడం జరిగిందని, 9 ఎం ఎల్ ఎస్ పాయింట్ల వద్ద వేయింగ్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశామని, ఎక్కడ ఎలాంటి తప్పులు దొర్లకుండా, లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్నిచోట్ల సన్న బియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతున్నదని, సన్న బియ్యం పంపిణీ తో పాటు, లబ్ధిదారులతో కలిసి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ భోజనం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రతి పేద కుటుంబానికి చేరుకోవాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు.
పీహెచ్సీ తనఖీ…
అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇదే మండలం, పాములపహడ్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను, ఓపి, ఇన్ పేషెంట్ సేవలు, వైద్య పరికరాలు, భవనం, ఇతర సౌకర్యాలను డాక్టర్ సత్యనారాయణ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో తాగునీటి సమస్య ఉందని తెలుపగా తక్షణమే మోటారు, బోరు మంజూరు చేశారు. అంతేకాక వేసవిని దృష్టిలో ఉంచుకుని రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకుగాను వార్డుతో పాటు, ఓపీలో రెండు ఏసీలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు, వ్యాక్సిన్, మందులు ఉంచేందుకు ఒక డొమెస్టిక్ ఫ్రిడ్జ్ ను మంజూరు చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ఎదురుగా ఉన్న పాడుబడిన భవనాన్ని వెంటనే తొలగించాలని ఎంపీడీవోను ఆదేశించారు. కాగా మంగళవారం ఓపి సుమారు 50 మంది వరకు వచ్చారు.హాజరు రిజిస్టర్ ను, ఏ ఎన్ సి రిజిస్టర్ లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. స్టెరిలైజేషన్ కిట్ ను, డెలివరీ కిట్ ను, బేబీ వార్మర్ ను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌరసరఫరాల ఇన్చార్జి అధికారి హరీష్, తహసిల్దార్, పిహెచ్ సి డాక్టర్ సత్యనారాయణ, ఎంపీడీవో తదితరులు ఉన్నారు.