Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Tripathi : మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

–చింతపల్లి పిహెచ్సి ఆకస్మిక తనిఖీ

–కస్తూరిబా విద్యార్థులతో ముఖాముఖి

District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : ఆరోగ్య సమస్యలు రాకుండా మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎప్పటి లాగే ఓపి రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇన్ పేషెంట్లు, ఔట్ పేషెంట్లు, మందులు, ఇతర స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. బుధవారం ఓపి పేషంట్ల వివరాలను డాక్టర్ శ్రీదేవితో అడిగి తెలుసుకున్నారు. కాగా చింతపల్లి పిహెచ్సి కి 84 మంది రోగులు రాగ, కొంతమంది ఇన్ పేషెంట్లు, అవుట్ పేషంట్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారి ద్వారా వివరాలను కనుక్కున్నారు. ఆసుపత్రి ఏ సమస్యతో వచ్చారని?

ఏ జబ్బుతో బాధపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు . గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కెనాన్ ద్వారా అందిస్తున్న సేవలను డాక్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సిలో కాన్పుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వారితో పాటు, వారి పిల్లలు బాగుంటారని తెలిపారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని తనిఖీ చేసి పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు. తరగతి గదిలోకి వెళ్లి వారి విద్యా సామర్ధ్యాలను తెలుసుకున్నారు.

పాఠశాల కిచెన్ గది బాగా లేకపోవడం, రూప్ సరిగా లేకపోవడంతో డిఇఓ తో మాట్లాడి వెంటనే వాటిని బాగు చేయించాలని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత ఎంపీడీవో కార్యాలయంలో మండలంలో తాగునీటి సరఫరా, తదితర అంశాలపై దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, తహసిల్దార్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులతో మాట్లాడారు.తాగు నీటి ఎలా ఉందని ఏఈ ని అడిగి తెలుసుకున్నారు. హరిజనాపురంలో వాటర్ ట్యాంకు పాతబడిపోయిందని, కుర్మపల్లి, కురుమేడ్ గేట్ల వద్ద సమస్య ఉండగా, ఇది వరకే డిఎంఎఫ్టి ద్వారా జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేశారని, పనులు మొదలు పెడుతున్నామని ఏఈ చెప్పారు. హరిజనపురంలో కొత్త వాటర్ ట్యాంకు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతేకాక అప్పటివరకు నీటి ఇబ్బందులు లేకుండా కొత్త బోర్ వేసుకునేందుకు కలెక్టర్ అనుమతించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీవో రమణారెడ్డి, తహసిల్దార్, రమాకాంత్ శర్మ, మిషన్ భగీరథ ఏఈ తదితరులు ఉన్నారు.