— నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షు లు నాగం వర్షిత్ రెడ్డి
District President Nagam Varshit Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భార త రాజ్యాంగం రచించిన మహనీ యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబే ద్కర్ అని, ఆయన సూచించిన స న్మామార్గంలో ప్రతి ఒక్కరు పయ నించాలని బీజేపి జిల్లా అధ్యక్షులు డా నాగం వర్షిత్ రెడ్డి సూచించారు.బిజేపీ జిల్లా కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన అంబేద్కర్ జ యంతి కార్యక్రమంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నాగం వర్శిత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అదే విధంగా డిఇవో కార్యాలయం దగ్గర వున్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని ఉద్దేశపూర్వకంగా ఓ డించి అవమానపర్చారని అన్నా రు.
భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వక పోగా కనీసం పార్లమెంట్ లో అం బేద్కర్ ఫొటో పెట్టలేకపోయారని అన్నారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చా క అంబేద్కర్ కి భారతరత్న ఇచ్చి పార్లమెంట్ హాల్ లో అయన ఫొటో పెట్టి గౌరవించిన పార్టీ మా బిజెపి పార్టీ అని అన్నారు. అంబేద్కర్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో ముడిపడిన ఐదు ప్రదేశాలను పం చతీర్థ క్షేత్రాలుగా అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీబిజెపి ప్రభుత్వం అని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సా ధన లో బిజెపి ప్రభుత్వం దళితు లకు అనేక సంక్షేమ పథకాలను క ల్పించడం జరిగినదన్నారు.
ఈ కార్యక్రమంలో బిజేపీ రాష్ట్ర కా ర్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్ , బిజే పీ నాయకులు పిల్లి రామరాజు, బి జెపి దళితమోర్చా రాష్ట్ర ఉపా ధ్యక్షులు చింత ముత్యాలరావు, బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగ స్వామి,బీజేపి జిల్లా నాయకులు బీపంగి జగ్జీవన్ రామ్ ,పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న, చింత శివరామ కృష్ణ, శాం తి స్వరూప్, రావెల కాశమ్మ, గూగు లోతు తార తగితరులు పాల్గొన్నా రు.