–14 మోటార్ సైకిళ్ళ స్వాధీనం
— వివరాలు వెల్లడించిన జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్
— కేసు చేదించిన అధికారులకు రివార్డ్ ప్రకటన
District SP Sharat Chandra Pawar : ప్రజాదీవెన, నల్గొండ: గత కొన్ని రోజులుగా వరుసగా తెలంగాణ లోని దామరచర్ల, నల్గొండ పట్టణం, నార్కట్పల్లి, ఇబ్రహీంపట్నం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్టూర్, పొన్నూరు పట్టణాలలో రాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ను అరెస్టు చేసినట్లు జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన వేలేకరుల సమావేశం లో వివరాలు వెల్లడించారు. వారి నుండి రూ. 26,50,000 విలువగల 14 మోటార్ సైకిలను స్వాధీనపరచుకునట్లు తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోనే గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నలమాల యెర్రబ్బాయి, గుంజి అంకమ రావు అనే ఇద్దరూ, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల కు చెందిన మట్టిపల్లి శ్రీకాంత్ లు ఈ దొంగతనాలకు పాల్పడ్డారు.
కాగా ముగ్గురు నేరస్తులలో మొదటి వ్యక్తి గత మూడు సంవత్సరాలుగా రాష్టం లోని నల్గొండ జిల్లాలో గల దామరచర్ల, నల్గొండ పట్టణం, నార్కట్పల్లి, ఇబ్రహీంపట్నం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్టూర్, పొన్నూర్ పట్టణాలలో గల ప్రభుత్వ కార్యాలయాలు, జన సంచారం గల హోటలు, వైన్స్ ల వద్ద, రాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్, పల్సర్ బైకులను దొంగిలించి తన స్నేహితులైన మిగిలిన ఇద్దరు వ్యక్తులతో కలసి వాటిని తక్కువ ధరకు అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. నేర పరిశోధనలో భాగంగా బుధవారం తెల్లవారు జామున వాడపల్లి ఎస్సై తన సిబ్బంధి తో కలసి వాడపల్లి గ్రామ శివారులోని తెలంగాణ, ఆంద్రప్రదేశ్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయుచుండగా అదే సమయంలో మొదట ఇద్దరు నేరస్థులు గతంలో మాదిరిగానే దొంగిలించిన మోటార్ సైకిల్ ను అమ్మడానికి గుంటూరు వైపునకు వెల్లుతుండగా అనుమానం వచ్చి పట్టు కొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. అనంతరం వారి ముగ్గురి వద్ద నుండి 14మోటార్ సైకిల్ లను స్వాధీనపరుచుకున్నారు. ఈ ముగ్గురు నేరస్తుల పై గతంలో నల్గొండ జిల్లాలో 66 మోటార్ సైకిల్ ను దొంగిలించిన కేసులు ఉన్నాయి.కాగా
కేసులను చేధించి ప్రజలకు పోలీస్ ల పై మరింత నమ్మకం కలిగేలా చేసిన మిర్యాలగూడ రూరల్ సీఐ పి యన్ డి ప్రసాద్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ డానియల్, వాడపల్లి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి,
సిబ్బంది సతీశ్, భాస్కర్, వెంకటేశ్వర్లు, రషీధ్, నల్లగొండ సిసిఎస్ సిబ్బంధి హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్దన గిరి, రాంప్రసాద్, పుష్పగిరి, శ్రీనివాస్ రెడ్డి లను జిల్లా ఎస్పి అభినందించి రివార్డ్ ప్రకటించారు.