Diwali celebrations: ప్రజా దీవెన,కోదాడ: పట్టణంలోని స్థానిక మేళ్లచెరువు రోడ్డులో గల ఎస్ఆర్ఎం పాఠశాలలో (SRM school) మంగళవారం ముందస్తుగా దీపావళి వేడుకలు (Diwali celebrations) ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులను వేసి దీపాలను వెలిగించి ఆటపాటలతో సందడిగా గడిపి నరకాసుని దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కేశినేని. శ్రీదేవి (Sridevi) మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా తర తరాలుగా దీపావళి పండుగను జరుపుకుంటున్నామని తెలిపారు.ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హాని కలిగించకుండా దీపావళి పండుగను జరుపుకోవాలని అన్నారు. తల్లిదండ్రులకు విద్యార్థులకుపాఠశాల ఉపాధ్యాయులకు దీపావళి శుభాకాంక్షలు (Diwali celebrations) తెలియజేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.