–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
–దామరచర్ల పిహెచ్సి ని తనిఖీ చేసిన కలెక్టర్
Doctor Accessibility : ప్రజాదీవెన నల్గొండ : ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.గురువారం ఆమె నల్గొండ జిల్లా, దామరచర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపి రిజిస్టర్, ఇతర రిజిస్టర్ ను, మందుల స్టాక్ ను పరిశీలించారు. డాక్టర్లతో మాట్లాడుతూ సమయం ప్రకారం డాక్టర్లు, సిబ్బంది విధులకు హాజరు కావాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా వైద్యం కోసం వచ్చిన రోగులను వెంటనే ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యం అందించాలని, కేసులు సీరియస్ గా ఉన్నప్పుడు మాత్రమే నల్గొండ ప్రభుత్వాసుపత్రికి లేదా ఇతర ఆసుపత్రులకు రెఫెర్ చేయాలని చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ కేంద్రంలో ఉన్న పిల్లలను పరిశీలించారు. అంతేకాక నిర్మాణంలో ఉన్న టాయిలెట్ పనులను తనిఖీ చేశారు. ఆక్టివిటీ రూమ్ లో
నూతన సాంకేతిక తను ఉపయోగించి
విద్యార్థులకు కృత్యాధార పద్దతిలో బోధించడం జరుగుతుందని, అలాగే ఫిజియోథెరపీ ఏర్పాటు చేయడం జరుగుతుందని
తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని తనిఖీ చేసి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా కె జి బి వి పరిసరాలు, టాయిలెట్స్ అన్నింటిని తిరిగి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్,
మండల ప్రత్యేక అధికారి, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.