Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dr. Aruna Kumari : దివిస్ లెబొరెటరిస్ ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు

Dr. Aruna Kumari :ప్రజాదీవెన నల్గొండ టౌన్ :దివీస్ లెబొరెటరిస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రజల తాగునీటి సౌకర్యార్థం ఆర్వో ప్లాంట్ లను ఏర్పాటు చేశారు. ఆ ప్లాంట్ల ను సోమవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ కుమారి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం దివిస్ లెబొరెటరిస్ ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఆర్ ఎం ఓ లు డాక్టర్ రత్నా, డాక్టర్ అనిత, ఆసుపత్రి సిబ్బంది, దివిస్ ప్రతినిధులు బి. కిషోర్ కుమార్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.