Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dr. Dasoju Shravan : చరిత్రాత్మక విజయోత్సవంగా వరం గల్ వజ్రోత్సవసభ

–కాంగ్రెస్ దుర్మార్గ పాలనను ఎండ గడదాo
–శాసన మండలి సభ్యులు డాక్టర్ దాసోజు శ్రావణ్

Dr. Dasoju Shravan : ప్రజా దీవెన, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన 25 వ సంవత్సరాల వజ్రోత్సవ సభను ఏప్రిల్ 27న వరంగల్‌లో ఘనంగా నిర్వహించి, దాన్ని చరిత్రలో నిలిచి పోయే సంఘటనగా మలుద్దామని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్ ప్రకటించారు. కార్వాన్ నియోజకవ ర్గంలోని రాంసింగ్‌పురాలో జరిగిన భారీ సన్నాహక సమావేశంలో కా ర్యకర్తలను ఉద్దేశించి మాట్లాడు తూ ఆయన ఈ గొప్ప సభ కోసం సమాయత్తమవ్వాలని పిలుపుని చ్చారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభు త్వం 16 నెలల్లో చేసిన దుష్పరిపా లనపై తీవ్ర విమర్శలు గుప్పించా రు. డాక్టర్ శ్రావణ్ మాట్లాడుతూ తె లంగాణ రాష్ట్ర సాధన కోసం కె. చం ద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపిం చిన బీఆర్ఎస్‌కు ఈ వజ్రోత్సవం ఒక గర్వకారణమని చెప్పారు.

ఇది కేవలం 25 ఏళ్ల వేడుక మాత్ర మే కాదు, తెలంగాణ ప్రజలకు మ న పార్టీ మరియు మన నాయకత్వ నిబద్ధతను మరోసారి గట్టిగా చాటే సందర్భమని ఆయన అన్నారు. కా ర్వాన్ నుంచి వేలాదిమంది మంది కార్యకర్తలు వరంగల్‌కు తరలిరావా లని, ఈ సభను “పింక్ ఫెస్టివల్”గా మార్చాలని పిలుపునిచ్చారు.
మన బలాన్ని రాష్ట్రమంతా చూసే లా ఈ సభను చరిత్రాత్మకం గా నిల పాలని ఆయన ఉద్ఘాటించారు.

కవరంగల్ సభలో బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి పాల నను, కాంగ్రెస్ వల్ల జరిగిన విధ్వంసాన్ని ప్రజల ముం దు ఉంచుతామని చెప్పారు. కేసీఆ ర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి లో ఉన్నత శిఖరాలు అందుకుంది. కానీ, 16 నెలల్లోనే ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాడు,” అని ఆయన ఆరోపించారు. ఉద్యో గాలు, సాగునీరు, కరెంట్, రైతు సం క్షేమం వంటి కీలక అంశాలను ప ట్టించుకోకుండా, ఎన్నికల హామీల ను మరిచిన కాంగ్రెస్‌ను ప్రజల ముందు బట్టబయలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

వజ్రోత్సవ సభ బీఆర్ఎస్ పునరు జ్జీవనానికి బాటలు వేస్తుందని, కేసీ ఆర్ పార్టీని బలోపేతం చేసే దిశాని ర్దేశం చేస్తారని తెలిపారు. కేసీఆర్ ప్రసంగం మా కార్యకర్తల్లో స్ఫూర్తి నింపి, అధికారం తిరిగి సాధించే మార్గాన్ని చూపిస్తుందని ఆయన అన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావ డం ఖాయమని గట్టి నమ్మకం వ్య క్తం చేస్తూ ప్రజలు ఆయన నాయక త్వంపై ఉన్న అచంచల విశ్వాసం తో, కేసీఆర్ మూడోసారి ముఖ్య మంత్రిగా వస్తారు. ఈ సభ ఆ ప్ర యాణానికి శ్రీకారం చుడుతుందని ఆయన చెప్పారు. ఇటీవల జిల్లాల వారీగా కేసీఆర్ చేస్తున్న సమావేశా లు పార్టీ ఊపును చూపిస్తున్నా యని ఆయన పేర్కొన్నారు.

చలో వరంగల్ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తి నింపా లని డాక్టర్ శ్రావణ్ పిలుపునిచ్చా రు. “ప్రతి కార్యకర్త, అభిమాని ఈ సభను విజయవంతం చేయాలి. బీఆర్ఎస్ తెలంగాణ నిజమైన గొం తుక, ఆశాకిరణమని గట్టిగా చా టాలని ఆయన ఉద్ఘాటించారు. జిల్లాలన్నీ సన్నాహాల్లో మునిగిపో యాయని, కార్వాన్ ఈ ఉద్యమం లో పట్టణ ప్రాంతాల నుంచి ముం దుంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పునరుద్ధరించే సమయం ఇదని ఆయన అన్నారు. హను మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగ నున్న ఈ వజ్రోత్సవ సభకు ముం దు నెల రోజుల సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు జరుగుతోంది. ఇది బీఆర్ఎస్ పునర్గఠనపై దృష్టి సారిస్తోందని స్పష్టమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బ నుంచి కోలుకుని, వ రంగల్ సభను రాజకీయ పున రా గమనానికి వేదికగా చేయాలన్న దృఢ సంకల్పాన్ని డాక్టర్ శ్రావణ్ ఉద్వేగభరిత ప్రసంగం వెల్లడిస్తోం ది.

ఈ సమావేశంలో సీనియర్ నాయ కులు జీవన్ సింగ్, శ్రీనివాస్ గుప్తా, శేఖర్ రెడ్డి, శ్రీధర్, డివిజన్ అధ్య క్షులతో పాటు పలువురు మహిళా, పురుష నాయకులు పాల్గొన్నారు.