Dr. Gopal : ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ లో ఉపాధి అవకాశాలపై ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అధ్యాపకులు డా గోపాల్ హెగ్డే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆప్టికల్ ఫైబర్ సెన్సార్, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్స్ సోలార్ సేల్స్, లైడార్, వంటి అధునాతన వినియోగంపై ఉత్పత్తులపై అవగాహన ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలను విద్యార్థులకు వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఎన్నో ఉత్తమ నిలబెట్టిన విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ సుధారాణి, డా హరీష్ కుమార్, డా ఎం జయంతి,కే మౌనిక, వై నాగరాజు, అవినాష్ బాబు, కె మౌనిక, హుమా అఫ్రిన్, రాజేశ్వరి, స్వర్ణలత, లావణ్య రంగారెడ్డి రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.