Dr Maddileti : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం లోని గణిత విభాగ ఆధ్వర్యంలో విభాగ అధిపతి డాక్టర్ మద్దిలేటి ప సుపుల అధ్యక్షతన అతిధి ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగిం ది. ఈ కార్యక్రమానికి సైన్స్ కళాశా ల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్ సాగర్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ” గణిత మూలాలు- వాస్త వ విశ్లేషణ ” అనే అంశంపై కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ రాష్ట్రానికి చెందిన డాక్టర్ ఏ.నౌ ఫాల్ విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చారు.
పీజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి భవిష్యత్తులో పరిశో ధనలు మరియు ఉద్యోగ అవకాశా లపై ముచ్చటించారు. ఈ కార్య క్రమంలో గణిత విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ డాక్టర్ జి ఉపేం ద ర్ రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ డి. హైమావతి డాక్టర్ ఏ శ్రీనివాసు మరియు డాక్టర్ ఎన్ కిరణ్ కుమా రు మరియు విద్యా ర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదనంతరం ప్రిన్సిపాల్ చేతుల మీదుగా గణిత విభాగం అధ్యాపకులు డాక్టర్ ఏ. నోఫల్ ఘనంగా సన్మా నించారు.