DrdaPD: ప్రజాదీవెన, నల్గొండ: నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై. శేఖర్ రెడ్డి కి పదోన్నతి లభించింది. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న శేఖర్ రెడ్డి కి జాయింట్ డైరెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పీడీ శేఖర్ రెడ్డి కి పదోన్నతి లభించడం పట్ల జిల్లా గ్రామీణ అభి వృద్ధి కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ పుష్ప గుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.