Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Driver Dies : ఇసుక ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి

Driver Dies : ప్రజా దీవెన/కనగల్: కనగల్ మండలంలోని, బోయినపల్లి గ్రామానికి చెందిన కడారి వెంకన్న (రాయుడు) (45) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పగిల్ల యాదయ్యకు చెందిన స్వరాజ్ 843 XM (TS05 UE 5960) ట్రాక్టర్ మరియు ట్రాలీ (TS05 59) పై ఆన్‌లైన్ ఇసుక రవాణా చేస్తుండేవాడు. రోజువారీగా, కడారి వెంకన్న (రాయుడు) ఇసుకను లోడ్ చేసుకొని అన్లోడ్ చేయడానికి వెళ్తుండగా, బుడమర్లపల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ డీజిల్ అయిపోవడంతో, దానిని పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్క్ చేశాడు .

ఈ సమయంలో, ట్రాలీ వెనుక డోర్ ఊడిపోవడంతో, అదే ప్రాంతంలో ఉన్న మరో డ్రైవర్ కారింగు లింగస్వామి సహాయంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు. అయితే, అనుకోకుండా ట్రాక్టర్ ముందుకు కదలడంతో, ట్రాక్టర్ ఇంజన్ ఆపేందుకు వెంకన్న స్టీరింగ్ స్టీరింగ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, బ్యాటరీపై కాలు పెట్టిన అతడు ప్రమాదవశాత్తు జారి పడిపోవడంతో, ట్రాక్టర్ మధ్య టైరు అతని తల మీదుగా వెళ్లింది. తీవ్ర గాయాల కారణంగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనపై మృతుడి కుమారుడు కడారి శివ ఫిర్యాదు చేయగా, కనగల్ ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు