Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Drug-Free Society : డ్రగ్స్ రహిత సమాజo ప్రభుత్వం సంకల్పం

–మాదక ద్రవ్యాల కేసుల్లో కఠినంగా వ్యవహరించాల్సిందే
–డ్రగ్స్ విక్రయిస్తే విధిగా సమాజ బహిష్కరణ
–యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
— రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

Drug-Free Society : ప్రజా దీవెన, హైదరాబాద్: భవిష్య త్‌లో సమాజాన్ని కాపాడటానికి ఈరోజే తెలంగాణ ప్రభుత్వం సంక ల్పం తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. మాదక ద్రవ్యాల కేసులు వస్తే కఠినంగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు జా బ్స్‌తో బిజీగా ఉంటున్నారని, ఈ క్ర మంలో పిల్లలు చెడుకు బానిసలు అవుతున్నారన్నారు. డ్రగ్స్ ఎవరు తీసుకున్నా ప్రభుత్వానికి,పోలీసు లకు సమాచారం ఇవ్వాలన్నారు.

అంతర్జా తీయ డ్రగ్స్ దుర్వినియో గం అక్రమ రవాణా వ్యతిరేక దినో త్సవాన్ని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్ జలవి హార్ వద్ద యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్య క్రమానికి మంత్రులు పొన్నం ప్రభా కర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హై దరా బాద్ సీపీ సీవీ ఆనంద్, సినీ హీరో నిఖిల్ లు హాజరయ్యారు. డ్రగ్స్ వాడకంపై వ్యతిరేకంగా మం త్రులు, టీజీ న్యాబ్ ఉన్నతాధికారు లు షార్ట్ ఫిలింను రిలీజ్ చేశారు. అలాగే డ్ర గ్స్ నివారణపై పోస్టర్లను మంత్రులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు గోవా వెళ్లి డ్రగ్స్ ముఠా చైన్ కూడా బ్రేక్ చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ అమ్మే వారిని సమాజం నుంచి బహిష్క రించాలన్నారు. మాదక ద్రవ్యాలు తెలంగాణలో కనబడవద్దు అనే ని నాదంతో పనిచేయాలని మంత్రి పొ న్నం ప్రభాకర్ తెలిపారు. ప్రపంచం లో తెలంగాణ పోలీస్‌కు ప్రత్యేక గు ర్తింపు ఉందని మంత్రి అడ్లూరి ల క్ష్మణ్ కుమార్ అన్నారు. డ్రగ్స్ ని వారణపై పోలీసులు నిరంతరం కృ షి చేస్తున్నారన్నారు. డ్రగ్స్ నివారణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృ షి చేస్తుందని చెప్పారు. డ్రగ్స్‌కు అ లవాటు పడి జీవితాన్ని నాశనం చే సుకోవద్దని మంత్రి కోరారు.వారం రో జుల పాటు డ్రగ్స్ నివారణపై వి ద్యార్థులకు అవగాహన కల్పిస్తామ ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కోవిడ్ తర్వాత , కోవిడ్ సమయంలో లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో యువత నిర్బంధానికి గురి అయ్యా రని, ఆ సమయంలో ఫ్రెండ్స్ గ్రూప్స్‌ గా ఏర్పడి డ్రగ్స్‌కు అలవాటు పడ్డా రన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ ని వారణపై చాలా సీరియస్‌గా వ్యవ హరిస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ ని వారణపై ప్రతీసారి కార్యక్రమాలు చే పడుతున్నామన్నారు. డ్రగ్స్ అమ్మే వారిని, రవాణా చేసేవారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నామన్నారు. డ్రగ్స్‌కు బానిస అయిన విద్యార్థులకు కౌన్సి లింగ్ ఇస్తున్నామన్నారు. 7, 8 తర గతి స్టూడెంట్స్ కూడా డ్రగ్స్‌కు అల వాటు పడుతున్నారని తెలిపారు. డ్రగ్స్ కంట్రోల్ చేస్తున్న లిస్ట్‌లో తె లంగాణకు ప్రపంచ వ్యాప్తంగా గు ర్తింపు వచ్చిందని సీపీ ఆనంద్ వెల్ల డించారు.డ్రగ్స్‌కు దూరంగా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుందని సినీ హీరో నిఖిల్ అన్నారు. చిన్న పుడు నుంచి సిగరెట్, డ్రగ్స్‌కు దూ రంగా ఉండటం వల్లే తన జీవితం సంతోషంగా ఉందని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూ రంగా ఉండాలని కోరారు. జీవితం లో హీరో, డాక్టర్, యాక్టర్, సైంటిస్ట్ అవ్వాలి అంటే ముందుగా ఆరో గ్యంగా ఉండాలని హీరో నిఖిల్ పే ర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేం దర్ , మేయర్ గద్వాల్ విజయల క్ష్మీ, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాం డిల్యతో పాటు వివిధ కళాశాల వి ద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.